Srisailam: శ్రీశైలంలో సంతాన ఫలవృక్షం దర్శిస్తే.. సంతాన సమస్యలు క్లియర్

Srisailam: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పుట్టడం కోసం ఎన్నో పుణ్యాలు చేస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు, పూజలు ఇలా ఎవరు ఏం చెబితే అవి చేస్తున్నారు. అయినా కూడా పిల్లలు పుట్టే సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది. గత జనరేషన్తో పోలిస్తే ప్రస్తుతం అయితే ఎక్కువగా సంతాన సమస్యలు వస్తున్నాయి. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యల వల్ల చాలా మంది మహిళలు, పురుషులు కూడా పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్నారు. అయితే శ్రీశైల మహా క్షేత్రంలో ఓ సంతాన ఫల వృక్షం ఉంది. ఈ వృక్షాన్ని దర్శించుకుని, పూజలు చేస్తే తప్పకుండా పిల్లలు పుట్టే సమస్య తీరుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీశైలంలోని హటకేశ్వరం ప్రాంతంలో ఓ సంతాన ఫల వృక్షం ఉంది. దీన్ని భక్తులు ఎంతో బాగా కొలుస్తుంటారు.
పెళ్లి చేసుకున్న వివాహ జంట ఈ వృక్షాన్ని తప్పకుండా దర్శించుకుంటుంది. ఎందుకంటే ఈ చెట్టును దర్శించుకోవడం వల్ల వారి వివాహ బంధం బాగుంటుందని, అన్ని విధాలుగా కూడా అనుకున్న పనులు జరుగుతాయని నమ్ముతారు. అయితే సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న భక్తులు కూడా ఇక్కడికి వెళ్తుంటారు. ఈ చెట్టును దర్శించుకని పూజలు చేస్తే తప్పకుండా సంతాన సమస్య క్లియర్ అయ్యి పిల్లలు పుడతారట. హటకేశ్వరం ప్రాంతంలో ఉన్న సంతాన తలవృక్షం దగ్గర వరుసగా 41 రోజులు పూజలు చేయాలని పండితులు అంటున్నారు. మొత్తం 41 రోజుల పాటు రోజూ ఉదయం, సాయంత్రం 6 గంటలకు ఆ సంతాన వృక్షం దగ్గర పూజ చేయాలి. స్నానం చేసి భక్తితో శివుడిని స్మరిస్తూ 41 రోజులు పూజలు చేస్తే 42వ రోజు సంతాన వృక్షం నుంచి మారేడు పండుల మహిళ చీర చెంగులో పడుతుందట. ఇలా పడితే తప్పకుండా పిల్లలు పుడతారని పండితులు చెబుతున్నారు.
పెళ్లయిన ఆడవాళ్లు ఈ పండును ప్రసాదంగా భావిస్తారు. సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తులకు ఇదే సూచన. ఇలా 41 రోజులు చేస్తే తప్పకుండా పిల్లలు పుడతారు. శివపార్వతులు ఆశీర్వదాలు కూడా అందుతాయి. అయితే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎక్కువగానే వెళ్తుంటారు. ఎవరైతే ఎక్కువ ఏళ్ల నుంచి సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో అలాంటి వారు ఈ సంతాన వృక్షాన్ని సందర్శించుకోండి. శివుడిని భక్తితో ఇలా కోరితే తప్పకుండా వరాలు ఇస్తాడు. అయితే పెళ్లయిన ఆడవాళ్లు కూడా ఈ సంతాన వృక్షాన్ని దర్శించుకోవచ్చు. అక్కడ ఓ ముడుపు కూడా కట్టాలి. ఇలా శివునిని ప్రార్థించి అక్కడ ముడుపు కడితే.. మంచి సంతానం లభిస్తుందని, కొత్త జంట ఎంతో సంతోషంగా ఉంటారని అక్కడి భక్తుల నమ్మకం.