Buddha Purnima: బుద్ధ పూర్ణిమ నాడు ఏం చేస్తే మంచిదో తెలుసా?
ప్రతీ నెలలో వచ్చే ఒక్కో పౌర్ణమికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరు ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమికి ఎన్నో సంప్రదాయాలు పాటిస్తారు. ఈ పౌర్ణమి రోజున ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. మరికొందరు ఉపవాసం వంటి నియమాలు కూడా ఆచరిస్తారు. అయితే ఈ నెలలో బుద్ధ పౌర్ణమి వచ్చింది.

Buddha Purnima: ప్రతీ నెలలో వచ్చే ఒక్కో పౌర్ణమికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరు ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమికి ఎన్నో సంప్రదాయాలు పాటిస్తారు. ఈ పౌర్ణమి రోజున ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. మరికొందరు ఉపవాసం వంటి నియమాలు కూడా ఆచరిస్తారు. అయితే ఈ నెలలో బుద్ధ పౌర్ణమి వచ్చింది. వైదిక క్యాలెండర్ ప్రకారం మే 12వ తేదీన బుద్ధ పౌర్ణమిని జరుపుకుంటున్నారు. అయితే దీన్ని జరుపుకోరు. ఎవరికి అయితే బుద్ధుడు అంటే ఇష్టం ఉంటుందో వారే ఎక్కువగా ఈ బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. అయితే ఈ బుద్ధ పూర్ణిమ అనేది మే 11వ తేదీ రాత్రి 8 గంటల తిథికి ప్రారంభమైంది. మే 12వ తేదీన రాత్రి 10:25 గంటలకు తిథి పూర్తి అవుతుంది. ఈ సమయంలోనే బుద్ధ పూర్ణిమను జరుపుకోవాలి. ఈ సమయంలో బుద్ధునికి పూజలు నిర్వహించి.. స్నానాలు, దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే అంతా కూడా మంచి ఫలితం వస్తుందని నమ్ముతారు. అయితే సమీపంలో బుద్ధుని ఆలయాలు లేవు కదా.. మరి ఏం చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే బుద్ధ పూర్ణిమ నాడు ఏం చేస్తే మంచిది? ఎలా పూజిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: మినీ కశ్మీర్ అందాలను చూసి వద్దామా!
బుద్ధ పూర్ణిమ నాడు చాలా మంది విష్ణు మూర్తిని పూజిస్తారు. అలాగే రావి చెట్టును కూడా పూజిస్తారు. ఎందుకంటే ఈ చెట్టు దగ్గర బుద్ధుడు ధ్యానం చేసి.. మోక్షం పొందాడు. అందుకే స్త్రీలు ఈ బుద్ధ పూర్ణిమ నాడు తప్పకుండా రావి చెట్టుకు పూజించి.. కోరికలు కోరుకుంటారు. ఇలా పూజించడం వల్ల సంతానం కలుగుతుందని, అలాగే సంతోషంగా ఉంటారని పండితులు అంటున్నారు. ఎవరైతే ఎక్కువగా బాధలు అనుభవిస్తారో.. అలాంటి వారు తప్పకుండా ఈ బుద్ధ పూర్ణిమ నాడు ఉపవాసం ఆచరించాలి. రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత బుద్ధుని మళ్లీ పూజించి.. ప్రశాంతంగా ఉంటే మాత్రం తప్పకుండా కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు.
బౌద్ధ మతం ప్రకారం తప్పకుండా చంద్రుడిని సాయంత్రం చూడాలి. అప్పుడే ఉపవాసం పూర్తి అవుతుంది. బుద్ధ పూర్ణిమ నాడు చంద్రుని చూడటం చాలా ముఖ్యం. లేకపోతే మీకు ఎలాంటి ప్రతిఫలం కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. బుద్ధుడు శాంతికి ప్రతీక. శాంతిని కోరుకునే ప్రతీ ఒక్కరూ బుద్ధ పూర్ణిమ నాడు తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. బుద్ధుడిని పూజిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా, కూల్గా ఉండగలరు. తమని తాము కంట్రోల్ చేసుకోగలరు. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు బుద్ధుడిని పూజిస్తే తప్పకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు అయినా కూడా ఇట్టే తీరిపోతాయని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.