Pakistan : మామిడి పండ్లు అమ్మి ఆయుధాలు కొంటున్న పాక్

Pakistan : ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద ఆశ్రయ దేశంగా, దానిని ప్రోత్సహించే దేశంగా గుర్తింపు పొందింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్కు దీటైన జవాబిచ్చింది. అయితే, ఈ లోపు పాకిస్తానీ న్యూస్ వెబ్సైట్ ‘డైలీ టైమ్స్’ ప్రకారం… పాకిస్తాన్ పండ్లు, కూరగాయల ఎగుమతిదారుల సంఘం (PFVA) ఈ సీజన్లో 125,000 టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.853 కోట్ల ఆదాయమే లక్ష్యం
ఈ మామిడి పండ్ల షిప్మెంట్ మే 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ లక్ష్యం గత సంవత్సరం ఎగుమతుల కంటే 25,000 టన్నుల పెరుగుదలను సూచిస్తుంది. దీని ద్వారా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.853 కోట్లు) విదేశీ మారక ద్రవ్యం (Foreign Exchange) ఆర్జించాలని పాకిస్తాన్ ఆశిస్తోంది. ఈ ఆదాయాన్ని పాకిస్తాన్ తన ఆర్థిక అవసరాలకు, ముఖ్యంగా సైనిక కొనుగోళ్లకు వినియోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also:Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు
వాతావరణ మార్పులు, నీటి కొరతతో సమస్యలు
అయితే, వాతావరణంలో మార్పులు, నీటి కొరత దేశంలోని మామిడి ఉత్పత్తిపై ప్రభావం చూపవచ్చని PFVA ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై PFVA సహాయకుడు వహీద్ అహ్మద్ మాట్లాడుతూ..ఉత్పత్తిలో 20శాతం వరకు తగ్గుదల రావచ్చని, దీంతో మామిడి ఉత్పత్తి 1.8 మిలియన్ టన్నుల నుంచి 1.4 మిలియన్ టన్నులకు తగ్గుతుందని చెప్పారు. మామిడి ఉత్పత్తిలో ఎక్కువ భాగం పంజాబ్, సింధ్ రాష్ట్రాల నుండి వస్తుంది. అయితే ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి చాలా తక్కువ మొత్తంలో మామిడి ఉత్పత్తి జరుగుతుంది.
కొత్త మార్కెట్లపై దృష్టి
ఈ నష్టాన్ని తగ్గించుకోవడానికి PFVA కొత్త మార్కెట్లలో మామిడి పండ్ల ఎగుమతిని పెంచడంపై దృష్టి పెడుతోంది. ఇందులో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి కొరతతో పాటు పాకిస్తాన్ భారతదేశం మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న షిప్పింగ్ ఖర్చులు కూడా పాకిస్తాన్కు ఆందోళన కలిగిస్తున్నాయి.
Read Also:iPhone Users: ఐఫోన్ వినియోగదారులకు అలర్ట్.. కీలక సమచారం లీక్
ఈ సవాళ్లన్నిటినీ ఎదుర్కొన్నప్పటికీ మామిడి ఎగుమతి లక్ష్యాన్ని పూర్తి చేయగలమని పాకిస్తాన్ ఆశిస్తోంది. రాబోయే నెలల్లో వాతావరణం అనుకూలంగా ఉంటేనే ఈ ఆశ నెరవేరుతుందని PFVA పేర్కొంది. ఎందుకంటే, బలమైన గాలులు, భారీ వర్షాలు లేదా అధిక వేడి వంటి పరిస్థితులు మామిడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ మామిడి ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రక్షణ రంగానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.