Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Rain Alert ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడు, కృష్ణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Related News