Relationship Fraud : ప్రేమ పేరుతో మోసం.. రూ.30 కోట్ల డబ్బుతో ప్రియురాలు జంప్.. కోర్టుకెక్కిన ప్రియుడు!

Girlfriend Runs Away with Money : నేటి సమాజంలో ప్రేమ, అనుబంధాల నిర్వచనం మారిపోయింది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు పెరిగిపోతున్నప్పటికీ.. అవగాహన లేకపోవడంతో వాటిలో చాలావరకు విఫలమవుతున్నాయి. పెళ్లికి, బంధాలకు విలువ లేని ధోరణి పెరుగుతోంది. కొందరు ఒకరిని ప్రేమిస్తూనే, మరొకరితోనూ సంబంధాలు నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కెనడాలో జరిగిన ఒక సంఘటన సంచలనంగా మారింది. ప్రియుడికి లాటరీలో భారీగా డబ్బు తగలగా, ఆ డబ్బును తన ఖాతాలో వేయించుకున్న ప్రియురాలు, ఆ డబ్బుతో మరొకరితో పారిపోయింది. ఈ మోసం ఇప్పుడు కోర్టుకు చేరింది.
కెనడాలో లారెన్స్ అనే యువకుడు తన ప్రియురాలు మెక్ కేను అమితంగా ప్రేమించాడు. వారిద్దరి బంధం గాఢంగా ఉందని లారెన్స్ నమ్మాడు. అనుకోకుండా, లారెన్స్కు లాటరీలో భారీ జాక్పాట్ తగిలింది. ఏకంగా ఐదు మిలియన్ల కెనడియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు గెలుచుకున్నాడు.
Read Also:June Deadlines : జూన్లో ఇవి అస్సలు మర్చిపోవద్దు.. అన్నీ టైమ్లో చేసుకుంటే పర్ఫెక్ట్!
ఈ భారీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా సాంకేతిక ఇబ్బందులు లారెన్స్కు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియదు. అయితే, అతను తాను గెలుచుకున్న ఈ భారీ లాటరీ డబ్బులను తన ప్రియమైన మెక్ కే బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేశాడు. ప్రియురాలిపై ఉన్న నమ్మకంతో, ఆ డబ్బులను తనకు ఇస్తుందని లేదా భవిష్యత్తు కోసం ఉపయోగిస్తారని అతను భావించాడు.
లారెన్స్ బదిలీ చేసిన 30 కోట్ల రూపాయలను తన ఖాతాలో చూసిన మెక్ కే.. ఊహించని విధంగా ప్రవర్తించింది. ఆ డబ్బునంతా తీసుకుని, మరొక వ్యక్తితో పారిపోయింది. లారెన్స్ను పూర్తిగా విస్మరించి, అతని నమ్మకాన్ని వమ్ము చేసింది. ప్రియురాలి మోసంతో లారెన్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
Read Also:Rinku Singh: ఎంపీ రింకూ సింగ్ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్
ప్రియురాలి మోసంతో తీవ్రంగా నష్టపోయిన లారెన్స్, న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. తాను లాటరీలో గెలిచిన డబ్బును మెక్ కే మోసపూరితంగా తీసుకుందని ఆరోపించాడు. అయితే, మెక్ కే మాత్రం లారెన్స్ ఆరోపణలను ఖండించింది. ఈ కేసుపై కెనడా కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదొక మోసం లేదా కేవలం వ్యక్తిగత సంబంధాల మధ్య వివాదమా అనే దానిపై కోర్టు నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. ఈ సంఘటన కెనడాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.