Actor Amardeep: కళ్ల ముందే అలా చేసే సరికి.. లైవ్లో ఎమోషనల్ అయిన అమర్దీప్
బుల్లితెర నటుల్లో అమర్దీప్కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్న అమర్ దీప్ తెలియని వారంటూ ఉండరు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి మరి అమర్దీప్ సీరియల్స్కి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ షోతో అమర్దీప్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Actor Amardeep: బుల్లితెర నటుల్లో అమర్దీప్కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్న అమర్ దీప్ తెలియని వారంటూ ఉండరు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి మరి అమర్దీప్ సీరియల్స్కి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ షోతో అమర్దీప్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు పలు షోల్లో అమర్దీప్ కనిపిస్తుంటాడు. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. అయితే అమర్దీప్ ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 ప్రోగ్రాంలో కూడా కనిపిస్తున్నాడు. ఈ షోలో తన ప్రేమ గురించి చెబుతూ అమర్ ఎమోషనల్ అయ్యాడు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 ఒక ప్రోమోను విడుదల చేసింది. ఇందులో లవ్ థీమ్ కాన్సెప్ట్ వచ్చింది. అయితే కంటెస్టెంట్స్ అందరు వారి మొదటి ప్రేమ గురించి చెప్పాలి. ఈ క్రమంలో అమర్దీప్ మాట్లాడుతూ.. దగ్గర ఉండి అప్లికేషన్ పెట్టి.. బస్సు ఎక్కించాను. కానీ ఆ అమ్మాయి వేరే వాళ్లను లవ్ చేసి
ఇవన్నీ మన కళ్ల ముందే జరిగాయి. పంపించిన అమ్మాయి ఎప్పుడు వస్తుందని ఎదురు చూశా.. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయితో వచ్చింది. కళ్ల ముందే ఆ అమ్మాయిని అబ్బాయి వెనుక నుంచి హగ్ చేసుకున్నాడని ఎమోషనల్ అయ్యాడు. ఇలాంటివి కళ్ల ముందు చూస్తే ఎలా ఉంటుందని అన్నాడు. అమర్ ఎమోషనల్ కావడంతో.. నీకు మంచి అమ్మాయి భార్యగా లభించిందని.. బెస్ట్ గిఫ్ట్గా తేజు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ పెయిర్కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అమర్దీప్, తేజస్విని సీరియల్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే తేజస్విని కంటే అమర్ ముందుగా వేరే అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి తనని చీట్ చేసిందని గతంలో కూడా చాలా సార్లు చెప్పాడు.
కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 షోలో ఇద్దరు జడ్జీలు ఉన్నారు. బాయ్స్ వైపు శేఖర్ మాస్టర్ గర్ల్స్ టీంకు అనసూయ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. బాయ్స్ టీంలో అయితే నిఖిల్, మానస్, బం చిక్ బబ్లు, పృద్వి, ఇమ్మానుయేల్, దీపక్, సాకేత్ వంటి వారు ఉన్నారు. గర్ల్స్ టీంలో అయితే హమీద, తేజస్విని, రోషిణి, లాస్య, సుస్మిత, శ్రీ సత్య, ఐశ్వర్య, విష్ణుప్రియ వంటివారు ఉంటున్నారు. అయితే లవ్ థీంలో భాగంగా యాంకర్ శ్రీముఖి మొదటి లవ్ గురించి చెప్పమని శ్రీ సత్యని ఫస్ట్ అడుగుతుంది. ఆ తర్వాత ప్రియాంక, శివకుమార్ ఇద్దరిని స్టేజ్ పైకి పిలుస్తారు. వీరిద్దరి తర్వాత నిఖిల్ కూడా వస్తాడు. ఇలా ఈ ప్రోమో సాగుతుంది. ఈ షో ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది.