Covid 19 : భారీ యంత్రాల్లేవు.. నిమిషాల్లోనే రిజల్ట్.. బంకమట్టి కణాలతో కరోనా టెస్ట్

Covid 19 : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత, వైరస్ను గుర్తించడం అనేది ఎంతో క్లిష్టమైన ప్రక్రియగా మారింది. ఖరీదైన పరీక్షలు, ఎక్కువ సమయం పట్టడం, పెద్ద పెద్ద ల్యాబ్లు అవసరం కావడం వంటి కారణాలతో చాలా మందికి సకాలంలో నిర్ధారణ అయ్యేది కాదు. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)-గువాహటి పరిశోధకులు ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. కేవలం మట్టి కణాలను ఉపయోగించి, కరోనా వైరస్ ఉందో లేదో సులభంగా, చౌకగా, వేగంగా గుర్తించే పద్ధతిని వారు అభివృద్ధి చేశారు. ఇది వైద్య రంగంలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
Read Also:Viral Video : డబ్బులిస్తాను డేటింగ్ కు వస్తావా.. విదేశీ యువతి ఆఫర్ తిరస్కరించిన యువకుడు
సామాన్యుడికీ అందుబాటులో కరోనా టెస్ట్
ఈ కొత్త పద్ధతి చాలా సింపుల్గా ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి నమూనాను (ఉదా: ఉప్పునీటి ద్రావణం) తీసుకుని, అందులో ఈ ప్రత్యేక మట్టి కణాలను కలుపుతారు. కరోనా వైరస్ ఉంటే, ఆ మట్టి కణాలు వేగంగా మారిపోతాయి. అవి తేలికగా మారి, అవక్షేపణ రేటులో (కిందకి చేరే వేగంలో) మార్పులను చూపిస్తాయి. ఈ మార్పుల ఆధారంగా వైరస్ ఉనికిని గుర్తించవచ్చు. ఒకవేళ ఎలాంటి మార్పులు లేకపోతే, వైరస్ సోకలేదని అర్థం. ఈ పద్ధతిలోని అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఫలితాలు చాలా త్వరగా, స్పష్టంగా వస్తాయి.
Read Also:Garuda Purana : ఈ 5 రకాల వారితో సావాసం చేస్తే వినాశనం తప్పదు..జాగ్రత్తగా ఉండమంటున్న గరుడ పురాణం!
పీసీఆర్ కష్టాలకు చెల్లుచీటీ
ప్రస్తుతం కరోనాను గుర్తించడానికి పీసీఆర్ (PCR) పరీక్షలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, పీసీఆర్కు చాలా సమయం పడుతుంది (కొన్నిసార్లు గంటల తరబడి), పెద్ద పెద్ద ఖరీదైన యంత్రాలు అవసరం, వాటిని నిర్వహించడానికి నిపుణులైన ల్యాబ్ టెక్నీషియన్లు కావాలి. యాంటిజెన్ పరీక్ష ఉన్నప్పటికీ, వాటి ఖచ్చితత్వం తక్కువగా ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో, లేదా ల్యాబ్లు, నిపుణులు లేని చోట్ల పరీక్షలు చేయడం చాలా కష్టం. ఈ కొత్త మట్టి కణాల పద్ధతి అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లి పరీక్షలు చేయవచ్చు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు బెంట్నైట్ (బంకమట్టి) అనే ఒక ప్రత్యేక రకం మట్టిని ఉపయోగించారు. ఈ మట్టికి ఒక ప్రత్యేకమైన రసాయన నిర్మాణం ఉంటుంది. ఇది కాలుష్య కారకాలను, భార లోహాలను సులభంగా తనలో ఇముడ్చుకోగలదు. అంటే, ఇది వైరస్లను కూడా తనలోకి లాక్కుంటుంది. అందుకే, వైరస్లను గుర్తించడానికి మట్టిని ఉపయోగించే పద్ధతులు ఇప్పటికే ఉన్నప్పటికీ, ఈ కొత్త విధానం మరింత మెరుగ్గా పనిచేస్తుంది.