Mantram: ఈ మంత్రం డైలీ జపిస్తే.. ప్రమాదాలు జరిగినా మీరు దీర్ఘాయువుగా ఉండటం పక్కా
ప్రతీ మనిషి ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని బయటకు వెళ్లిన కోరుకుంటారు.

Mantram: ప్రతీ మనిషి ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని బయటకు వెళ్లిన కోరుకుంటారు. ఎవరైనా కూడా ఇంటి నుంచి బయలుదేరి వెళ్తే.. కొబ్బరి కాయ కొట్టి వెళ్తారు. అలాగే ఇంట్లో పూజలు చేసి బయలుదేరుతారు. అలాగే కొందరు కొన్ని పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు. అలాగే పూజలు కూడా నిర్వహిస్తారు. వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు కూడా రావని నమ్ముతారు. అయితే ఎలాంటి ఆపదలు, ప్రమాదాలు రాకుండా ఉండేందుకు కొన్ని మంత్రాలు జపించాలని పండితులు చెబుతున్నారు.
డైలీ జపించడం వల్ల అనేక రోగాల నుంచి ఉపశమనం కలగడంతో పాటు అన్ని భయాలు కూడా తొలగిపోతాయి. అయితే అందరికి శక్తి నిచ్చే ముక్కంటి, సుగంధ భరితుడు అయిన శివయ్యా.. నిన్ను నేను పూజిస్తున్నాను. దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టు మృత్యు బందనం నుంచి నన్ను విడిపించమని కోరాలి. ఇలా రోజూ 3 లేదా 9 సార్లు కుదిరితే 108 సార్లు పారాయణం చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదాలు కూడా దరిచేరవు. ఈ మంత్రం చాలా పవర్ఫుల్. దీన్ని పారాయణం చేయడం వల్ల అనేక ప్రమాదాలు, దుష్ట శక్తుల నుంచి బయట పడతారు. ఈ మృత్యంజయ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో పఠిస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా మంది ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఏ వాహనం మీద వెళ్లినా, వెళ్లకపోయినా ఏదో విధంగా మృత్యువు ఎదురు వస్తుంది. ఎక్కడికి ప్రయాణించినా కూడా చాలా భయంతో వెళ్తున్నారు. ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి. దీన్ని పఠించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఒకవేళ జరిగినా కూడా మళ్లీ బతుకుతారని పండితులు అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది చాలా స్పీడ్గా కూడా డ్రైవ్ చేస్తున్నారు. దీనివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా యువత అయితే అసలు ఆలోచించకుండా చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే ఈ మంత్రం డైలీ పఠిస్తే కాస్త ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.