Financial Issues: అప్పులు బాధలతో నరకం అనుభవిస్తున్నారా.. ఈ మంత్రం జపించండి చాలు

Financial Issues: ఈ ప్రపంచంలో అప్పులు లేనివారు ఎవరూ ఉండరు. ఏదో ఒక టైమ్లో అవసరానికి అప్పులు తీసుకుంటారు. ఎంత ధనం ఉన్నా, ఎంత సంపాదించినా ఏదో ఒక సమయంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరు ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడితే, మరికొందరు నెలలు, సంవత్సరాలు గడిచినా అప్పుల బాధ నుండి విముక్తి పొందలేరు. దీని నుంచి విముక్తి పొందడానికి కొందరు దైవారాధన వైపు వెళ్తుంటారు. జీవితంలో అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలంటే మాత్రం ఆధ్యాత్మిక మార్గం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఐశ్వర్య మహా మంత్రం పటించడం వల్ల అప్పులు, రుణ బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే ఏ మంత్రం పటించడం వల్ల అప్పులు బాధల నుంచి విముక్తి పొందుతారో ఈ స్టోరీలో చూద్దాం.
ఆర్థికపరమైన సమస్యలు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, సంతానానికి సంబంధించిన సమస్యలు, అప్పుల బాధలు, కోర్టు కేసుల్లో చికాకులు ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా మంత్రం పటించవచ్చు. ఈ మంత్రం పటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీనిని నిత్యం జపించడం లేదా రాసుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే ఒక ఎర్రటి పెన్ను, తెల్ల కాగితం తీసుకుని దానికి నాలుగు వైపులా పసుపు, గంధంతో అంచు రాసి బొట్టు పెట్టాలి. ఆ గంధంతోనే కాగితం మధ్యలో ‘శ్రీ’ అనే అక్షరం రాయాలి. ఈ మంత్రం పేపర్పై రాయడం వల్ల అన్ని సమస్యలు పోయి మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. శ్రీ వత్స వక్షసం శ్రీ శం శ్రీ లోలం శ్రీ కరగ్రహమ్ శ్రీ మంతం శ్రీ నిధిమ్ శ్రీ ఢ్యం శ్రీ నివాసం భజేనిశం ! అని తెల్లని పేపర్పై రాయాలి. ఈ మంత్రంలో మొత్తం 8 ‘శ్రీ’లు ఉంటాయి. ఈ మంత్రానికి ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. ఈ మంత్రం వల్ల తిరుమలకు అంతటి గొప్ప వచ్చిందనే అంటుంటారు. అయితే ఈ మంత్రం పటించడం వల్ల అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని ముఖ్యంగా రుణ బాధలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.
మంత్రాన్ని రోజూ ఒకే సమయానికి రాసుకోవాలి. 28 సార్లు, వరుసగా 28 రోజులు రాస్తే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తారు. మీరు అనుకున్న కోరిక నెరవేరే వరకు ఈ మంత్రాన్ని రాసుకోవడం కొనసాగించాలి. మధ్యలో ఆపకుండా రోజూ ఇలా రాయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో ఎదురైన సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ కోరిక నెరవేరిన తర్వాత పేపర్ను ఎవరైనా హోమం (యజ్ఞం) చేస్తే అందులో వేసేయవచ్చు. అయితే ఈ పేపర్ను ఒక రావిచెట్టు ఆకులో చుట్టి హోమంలో వేస్తేనే ఫలితం ఉంటుంది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Karisma’s ex-husband Sanjay passes away: బాలీవుడ్ హీరోయిన్ మాజీ భర్త ప్రాణం తీసిన తేనెటీగ.. నోటిలోకి వెళ్లి ఎలా చంపిందంటే?