Marriage: పెళ్లిలో తలంబ్రాలు ఎందుకు పోస్తారంటే?
Marriage పెళ్లిలో వరుడు వధువు మెడలో తాళి కట్టిన తర్వాత ఒకరి చేతులతో ఇంకొకరు తలపై తలంబ్రాలు పోస్తారు. వీటినే అక్షతలు అని కూడా అంటారు. అయితే వరుడు ముందుగా వధువు తలపై తలంబ్రాలు పోస్తారు.

Marriage: పెళ్లి అనేది ఎంతో పవిత్ర బంధం. దీనికి గౌరవం ఇస్తూ ఎంతో ఖర్చు పెట్టి మరి హిందూ పద్ధతిలో పెళ్లి చేస్తారు. పెళ్లి అంటే ఏదో తూతు మంత్రంగా కాకుండా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వివాహం చేస్తారు. ఎన్నో నియమాలు పాటిస్తూ ఈ పెళ్లి వేడుకను నిర్వహిస్తారు. నిజానికి పెళ్లికి సంపాదించిన డబ్బులు అంతా కూడా పెట్టేస్తారు. అయితే మిగతా పద్ధతుల్లో కొందరు కొన్ని చేయరు. కానీ హిందూ సంప్రదాయాల్లో మాత్రం పెళ్లిలో ఎన్నో రకాలు ఉంటాయి. కాళ్లు కడగటం, అరుంధతీ నక్షత్రం చూపించడం, తలంబ్రాలు పోయడం ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అయితే పెళ్లిలో తలంబ్రాలు ఎందుకు పోస్తారు. వరుడు, వధువు ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. అసలు ఇలా తలపై పోసుకోవడానికి కారణం ఏంటి? వీటి వెనుక ఉన్న అంతరార్థం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పెళ్లిలో వరుడు వధువు మెడలో తాళి కట్టిన తర్వాత ఒకరి చేతులతో ఇంకొకరు తలపై తలంబ్రాలు పోస్తారు. వీటినే అక్షతలు అని కూడా అంటారు. అయితే వరుడు ముందుగా వధువు తలపై తలంబ్రాలు పోస్తారు. ఆ తర్వాత వధువు వరుడు తలపై తలంబ్రాలు పోస్తారు. ఇలా తలంబ్రాలు పోయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. వంశాభివృద్ధిని పెంచడంతో శాంతి సంతోషాలతో సుఖంగా ఉండాలని తలంబ్రాలు పోసుకుంటారు. అలాగే వధువు ఇంటికి వచ్చిన తర్వాత ధాన్యం ఎక్కువగా ఇంటికి రావాలని, ఇంట్లో సిరిసంపదలు ఉంటాయని ఇలా తలంబ్రాలు పోస్తారట. ధాన్యాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. అయితే ఈ ధాన్యం నుంచే బియ్యం వస్తాయి. ఇవి ఇంటికి సిరిసంపదలను తీసుకొస్తాయి. వీటిని తీసుకురావడం వల్ల ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని పండితులు అంటున్నారు.
ప్రస్తుతం రోజుల్లో ఇలా పెళ్లి చేసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఎంజాయ్ల కోసం ఏదో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇలా హిందూ సంప్రదాయాలు అన్ని కూడా పాటించి పెళ్లి చేసుకోవడం లేదు. కొన్ని హిందూ సంప్రదాయాలు పాటించి పెళ్లి చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా కూడా హ్యాపీగా ఉంటారని మన పెద్దలు చెబుతున్నారు. ఇలా చేసుకోకపోవడం వల్లే ఈ రోజుల్లో చాలా మంది వివాహాలు కలిసి రావడం లేదు.