Bindi: నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Bindi: బొట్టు నుదుటిపై పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు.. దీని వెనుక ఎన్నో ఆధ్యాత్మిక, సాంప్రదాయ, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. చాలా మందికి ఇది కేవలం ఒక ఆచారం అని మాత్రమే తెలుసు. కానీ నుదుటిన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే విషయం మాత్రం సరిగ్గా తెలియదు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.
హిందూ మతంలో నుదుటి మధ్య భాగాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో కన్ను అని పిలుస్తారు. ఇది మన ఆలోచనలు, అంతర్దృష్టి, జ్ఞానం, ఏకాగ్రతకు కేంద్రం. బొట్టును ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అయి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. బొట్టు పెట్టుకోవడం ద్వారా ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదురుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. వివాహిత స్త్రీలు నుదుటిన ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ ఎరుపు రంగు బొట్టు శక్తికి, శుభానికి, శ్రేయస్సుకి చిహ్నం. ఇది స్త్రీకి వివాహ బంధంలోకి ప్రవేశించినట్లు సూచిస్తుంది. భర్త దీర్ఘాయువు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు తప్పకుండా పెట్టుకోవాలి. బొట్టును శుభకార్యాలకు, పండుగలకు, గుడికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా పెట్టుకుంటారు. మంచి జరగాలని, అదృష్టం కలగాలని కోరుకునే వారు తప్పకుండా బొట్టు పెట్టుకుంటారు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారికి బొట్టు పెట్టడం అనేది చేస్తుంటారు. అయితే ఇది గౌరవంగా, ఆశీస్సులను అందించే విధంగా వారికి పెడతారు. కొందరు బొట్టును చెడు దృష్టి నుంచి లేదా నెగెటివ్ ఎనర్జీ నుంచి రక్షణగా భావిస్తారు. ఇది ఒక రకమైన కవచంలా పనిచేస్తుందని నమ్ముతారు. అలాగే బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ ప్రదేశంలో ఒత్తిడి ఏర్పడి, శరీరంలో శక్తి ప్రసరణ సరిగా జరుగుతుందని నమ్ముతారు.
నుదుటి మధ్య భాగంలో బొట్టు పెట్టుకోవడం వల్ల మెదడులో కొన్ని కీలక నాడులు ఉత్తేజితమై, ఏకాగ్రత పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. కొంతమందికి ఈ ప్రదేశంలో బొట్టు పెట్టుకోవడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయని, మంచి నిద్ర పడుతుందని నమ్మకం ఉంది. ఈ ప్రదేశంలో చందనం లేదా కుంకుమ పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎరుపు రంగు బొట్టు శక్తి, ప్రేమ, ధైర్యం, వివాహిత స్థితిని తెలియజేస్తుంది. పసుపు రంగు బొట్టు జ్ఞానం, శాంతి, శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు. నలుపు రంగు బొట్టు చెడు దృష్టి నుంచి రక్షణ ఇస్తుంది. ఎక్కువగా పిల్లలకు ఈ బొట్టు పెడతారు. తెలుపు బొట్టు ప్రశాంతత కోసం పెడతారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..
-
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలో కోటీశ్వరులు మీరే
-
Jamun Vinegar: ఈ వెనిగర్తో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. ఒక్కసారి తింటే చాలు
-
BSNL: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే రీఛార్జ్ చేయకుండా ఉండలేరు
-
IPL క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. Airtel, VI సూపర్ ప్లాన్స్..!
-
Marriage: పెళ్లిలో తలంబ్రాలు ఎందుకు పోస్తారంటే?
-
Maha Shivaratri: ఈ నియమాలు పాటిస్తూ ఉపవాసం ఆచరిస్తే.. పుణ్యమంతా మీదే