BSNL 5G : భాగ్యనగరంలో BSNL 5G సేవలు ప్రారంభం.. వినియోగదారుల నిరీక్షణకు తెర!

BSNL 5G : ఇండియాలో టాప్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు 5G సేవలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL కూడా క్వాంటమ్ 5G సేవలను మొదలుపెట్టింది. BSNL 5G రావడంతో కోట్లాది మంది ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. ప్రస్తుతానికి సాఫ్ట్ లాంచ్ అయింది. త్వరలోనే BSNL కొన్ని ముఖ్యమైన నగరాల్లో 5G సేవలను పూర్తిగా మొదలుపెట్టొచ్చు. అసలు, BSNL మొదట 5G సేవలను ఏ రాష్ట్రంలో మొదలుపెట్టిందో తెలుసా..
BSNL క్వాంటమ్ 5G ఇప్పుడే టెస్టింగ్ దశలో ఉంది. అంటే, ఇంకా పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాలేదు. BSNL తన అధికారిక X (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పింది. కంపెనీ చైర్మన్ (CMD) ఎ.రాబర్ట్ జె రవి, హైదరాబాద్లో క్వాంటమ్ 5G FWA (ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్) సేవలను ప్రారంభించారు. BSNL 5G సేవలతో ప్రజలు చాలా వేగవంతమైన ఇంటర్నెట్ను పొందగలరు.
Read Also:Vi : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. నెట్వర్క్ లేకపోయినా ఆడియో-వీడియో కాల్స్!
Hyderabad Witnesses the Future – BSNL Q-5G FWA (Quantum 5G) Soft-Launched
Shri A. Robert J. Ravi, @CMDBSNL soft-launched the revolutionary BSNL Quantum 5G FWA (Fixed Wireless Access) service in Hyderabad.
Now live in select cities. Experience lightning-fast internet with BSNL… pic.twitter.com/AwreC4xZq1— BSNL India (@BSNLCorporate) June 19, 2025
గతేడాది BSNL లక్ష 4G, 5G టవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 70 వేలకు పైగా టవర్లను ఆన్ చేశారు. కానీ ప్రజలకు మరింత మెరుగైన నెట్వర్క్ ఇవ్వడానికి మొత్తం లక్ష టవర్లను ఏర్పాటు చేయడాన్ని లక్షంగా పెట్టుకుంది. BSNL ఎప్పటిలోగా ప్రజలందరికీ 5G సేవలను పూర్తిస్థాయిలో అందిస్తుందో ఇంకా తెలియదు.
Read Also:Hair Loss: చక్కర తింటే జుట్ట ఊడిపోతుందా? అసలు నిజం ఇదీ
10 ఏళ్లలో BSNL భారీగా డబ్బు ఖర్చు
రెండు సంవత్సరాల క్రితం (మే 2023లో) BSNL తన పరికరాల కోసం ఎరిక్సన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎరిక్సన్తో పాటు తేజస్ నెట్వర్క్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లకు మొబైల్ టవర్లు పెట్టే పనిని అప్పగించారు. కంపెనీ రాబోయే పదేళ్లలో 4G మొబైల్ టవర్ల మెయింటెనెన్స్ కోసం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్లాన్ చేసింది.