Uber : క్యాబ్ బుక్ చేసుకుంటే టిప్ ఇవ్వొద్దు.. ఊబర్పై కేంద్రం సీరియస్

Uber : భారత ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్ సంస్థ అయిన ఊబర్కు భారీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఊబర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఊబర్ అమలు చేస్తున్న ‘అడ్వాన్స్ టిప్’ సిస్టమ్ (ముందస్తు టిప్ విధానం) గురించి అందించింది. ఎక్స్ ట్రా డబ్బులు చెల్లించి, త్వరగా రైడ్ కన్ఫర్మేషన్, పిక్అప్ పొందడానికి ఈ టిప్ సిస్టమ్ ద్వారా యూజర్లను బలవంతం చేస్తోందని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఆరోపించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దోపిడీగా ఆయన అభివర్ణించారు.
కేంద్ర మంత్రి జోషి టిప్ అనేది సర్వీసు పొందిన తర్వాత కృతజ్ఞతతో కస్టమర్లు స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన అభినందన అని, ముందుగానే డిమాండ్ చేసే అర్హత కాదని స్పష్టం చేశారు. ఊబర్ వ్యవహారశైలిపై తన ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే CCPAను దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆయన నొక్కి చెప్పారు.
Read Also:Viral Video : డ్రైనేజీ అనుకున్నాడు.. కానీ మరో లోకంలోకి వెళ్లిపోయాడు.. అదో భయానక ప్రపంచం
ఊబర్ యాప్లో క్యాబ్ బుక్ చేసుకునే సమయంలో త్వరగా బుకింగ్ కన్ఫర్మ్ అవ్వడానికి పిక్అప్ త్వరగా రావడానికి యూజర్ల నుంచి రూ.50, రూ.75 లేదా రూ.100 టిప్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. యాప్ మెసేజ్లలో “మీరు టిప్ యాడ్ చేస్తే, డ్రైవర్లు ఈ రైడ్ను యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది” అని ఉంటుంది. డ్రైవర్లకు టిప్లో 100శాతం అందుతుందని, అయితే యూజర్లు ఒకసారి టిప్ యాడ్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మార్చలేరని కూడా అందులో పేర్కొంటారు.
The practice of ‘Advance Tip’ is deeply concerning. Forcing or nudging users to pay a tip in advance, for faster service is unethical and exploitative. Such actions fall under unfair trade practices. Tip is given as a token of appreciation not as a matter of right, after the… pic.twitter.com/WaPH26oT9G
— Pralhad Joshi (@JoshiPralhad) May 21, 2025
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఊబర్కు నోటీసులు పంపడం ఇది మొదటిసారి కాదు. గతంలో, జనవరిలో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్) ఆధారంగా యూజర్ల నుంచి వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఊబర్, ఓలా రెండింటికీ CCPA నోటీసులు పంపింది. కొత్త నోటీసును బట్టి చూస్తే, భారతదేశంలో రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని స్పష్టమవుతోంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి.
Read Also:WiFi Speed Increase : మోడీ సర్కార్ నిర్ణయంతో మీ ఇంటి వైఫై స్పీడ్ ఇక రాకెట్ లా దూసుకెళ్తుంది