Fish Venkat Daughter: రామ్ చరణ్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్
Fish Venkat Daughter ఫిష్ వెంకట్ కూతురు సినీ పరిశ్రమ నుంచి విశ్వక్ సెన్, కృష్ణ మానినేని సాయం చేశారని స్రవంతి తెలిపింది. తన తండి చనిపోయాక గబ్బర్ సింగ్ టీమ్ తప్ప మరెవరూ తమను పరామర్శించేందుకు రాలేదని వెల్లడించింది.

Fish Venkat Daughter: టాలీవుడ్ నటుడు ఫిస్ వెంకట్ కిడ్నీ వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఫిష్ వెంకట్ కూతురు మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి చికిత్స కోసం సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సాయం అందలేదని తెలిపింది. రామ్ చరణ్ సాయం చేశాడన్న పుకార్లతో ఇంకెవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని తెలిపింది. ఫిష్ వెంకట్ ను రామ్ చరణ్ ఆసుపత్రిలో చేర్చారని, ఆర్థికసాయం చేశాడంటై తప్పుడు ప్రచారం జరిగిందని, దీంతో ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని తెలిపింది.
సినీ పరిశ్రమ నుంచి విశ్వక్ సెన్, కృష్ణ మానినేని సాయం చేశారని స్రవంతి తెలిపింది. తన తండి చనిపోయాక గబ్బర్ సింగ్ టీమ్ తప్ప మరెవరూ తమను పరామర్శించేందుకు రాలేదని వెల్లడించింది. మా నాన్న చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో పనిచేశారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఎవరూ ముందుకురాలేదు. కిడ్నీ మార్పిడి కోసం దాదాపు 50 లక్షలు రూపాయలు అవసరమని , ఈ భారీ ఖర్చును భరించే స్థోమత తమ కుటుంబానికి లేదని తెలిపారు.
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్
-
Kaushal: బిగ్ బాస్ తర్వాత నా జీవితం కోలాప్స్ : కౌషల్ షాకింగ్ కామెంట్స్
-
Fish Venkat Passes Away: ఫిష్ వెంకట్ కన్నుమూత
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్కు ఆర్థిక సాయం!