Vishal : 15 ఏళ్ల స్నేహం.. పెళ్లిగా మారనున్న బంధం.. విశాల్, ధన్షిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?

Vishal : కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ పెళ్లిపై గత కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 47 ఏళ్ల విశాల్, తనకంటే 12 ఏళ్లు చిన్నదైన నటి సాయి ధన్షిక (35)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆగస్టు 29న వీరి పెళ్లి జరగనున్నట్లు విశాల్, ధన్షిక స్వయంగా ప్రకటించారు.
చెన్నైలో సోమవారం (మే 19, 2025) సాయి ధన్షిక నటించిన ‘యోగి దా’ సినిమా ఆడియో లాంచ్, ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాల్ అక్కడే తన పెళ్లి విషయాన్ని వెల్లడించారు. ధన్షికతో కలిసి వేదికపై కనిపించిన విశాల్, తమ వివాహం ఆగస్టు 29న జరగనున్నట్లు తెలిపారు. ఇరువురు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, ఆనందంగా కనిపించడంతో వారి ప్రేమ బంధం, పెళ్లి ప్రకటన పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:itel P55 Plus : రూ.12,990లకే 16GB ర్యామ్, 256GB స్టోరేజ్, 50MP కెమెరా ఫోన్
ధన్షిక మాట్లాడుతూ, “విశాల్తో నాకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉంది. కానీ ఇటీవలనే మా మధ్య మాటలు పెరిగాయి. అది ప్రేమగా మారింది. మేము ఒకరికొకరం అర్థం చేసుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఐ లవ్ యూ, విశాల్!” అని ఎంతో ఆనందంగా చెప్పింది. కష్టకాలంలో విశాల్ తన ఇంటికి వచ్చి అండగా నిలిచాడని, ఏ హీరో కూడా అలా చేయలేదని ధన్షిక గుర్తు చేసుకుంది.
విశాల్ మాట్లాడుతూ, “నా పెళ్లి ఫిక్స్ అయ్యింది. నాకు తగిన అమ్మాయి దొరికింది. ధన్షిక చాలా అద్భుతమైన వ్యక్తి. ఆమె తండ్రి కూడా ఇక్కడ ఉన్నారు. వారి ఆశీస్సులతో ధన్షికను నా జీవిత భాగస్వామిగా పరిచయం చేస్తున్నాను” అని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, పెళ్లి తర్వాత కూడా ధన్షిక సినిమాల్లో నటిస్తుందని, ఆమె నటనను తాను అడ్డుకోనని హామీ ఇచ్చారు. దేవుడు ఎవరికైనా చివరికి బెస్ట్ ఇస్తాడని, తన విషయంలో అది ధన్షిక అని విశాల్ పేర్కొన్నారు.
Read Also:Traffic Fines : రూ. 12,000 కోట్ల జరిమానాలు.. రూ. 9,000 కోట్లు బాకీ.. ట్రాఫిక్ రూల్స్ పాటించడమే లేదట
విశాల్, సాయి ధన్షిక గత 15 సంవత్సరాలుగా స్నేహితులు. వారి స్నేహం ఇటీవల ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధానికి దారితీసింది. గతంలో విశాల్ ‘నడిగర్ సంఘం భవనం’ నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని శపథం చేశారు. ఆ భవనం నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో, విశాల్ తన మాట నిలబెట్టుకుని పెళ్లికి సిద్ధమయ్యారు.
సాయి ధన్షిక 2009లో ‘పేరన్మై’ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘మాంజా వెలు’ (2010), ‘నిల్ గవని సెలతే’ (2010), ‘అరవన్’, ‘పర్దేసి’ వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది. రజనీకాంత్ ‘కబాలి’ (2016) చిత్రంలో ఆయన కుమార్తెగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆమె ప్రస్తుతం ‘యోగి దా’ సినిమాలో నటిస్తోంది.
గతంలో కూడా పలువురు హీరోయిన్లను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నడన్న వార్తలు వచ్చాయి. 2018లో నటి వరలక్ష్మి శరత్కుమార్తో విశాల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చినా, ఇరువురు వాటిని ఖండించారు. విశాల్ గతంలో అనీషా రెడ్డి అనే తెలుగు నటితో నిశ్చితార్థం చేసుకున్నారు, కానీ ఆ తర్వాత అది రద్దయింది. ఇప్పుడు సాయి ధన్షికతో ఆయన వివాహం ఖరారు కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.