Ration Card: రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ముఖ్యమైన హెచ్చరిక.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే మీ కార్డు పనిచేయదు..

Ration Card:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఈనెల మార్చి 31 లోగా రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
పౌర సరఫరాల కమిషనర్ సౌరబ్ గోర్ ఈనెల 31 లోగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లాల అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ ప్రక్రియను రేషన్ కార్డు ఉన్నవాళ్లు గ్రామ మరియు వార్డు సచివాలయాల మొబైల్ యాప్ ద్వారా లేదా రేషన్ షాపులోని ఈపాస్ పరికరాల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఐదు సంవత్సరాల పిల్లలు మినహాయించి మార్చి 31లోగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ పూర్తి చేయాలని లేకపోతే రేషన్ కార్డు లబ్ధిదారులు భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కమిషనర్ హెచ్చరించారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్. రేషన్ కార్డుకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. కొత్త రేషన్ కార్డు కోసం చాలామంది పడిగాపులు కాస్తున్నారు. అయితే ప్రస్తుతం రేషన్ కార్డుగా ఉన్న వాళ్లు కూడా ఈ ముఖ్యమైన విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే వాళ్లు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మీకు రేషన్ కార్డు కనక ఉంటే తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోండి. ఎందుకంటే మీ యొక్క రేషన్ కార్డు వచ్చే నెల నుంచి పనిచేయకపోవచ్చు.
ఎందుకని అనుకుంటున్నారా.. రేషన్ కార్డు ఉన్నవాళ్లు వెంటనే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వాళ్ల రేషన్ కార్డు వచ్చే నెల నుంచి పనిచేయదు. అంటే మీకు వచ్చే నెల నుంచి బియ్యం సహా ఇతర రేషన్ సరుకులు లభించవు. మీరు రేషన్ కార్డుకు వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలియజేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.
లేకపోతే వచ్చే నెల నుంచి బియ్యం కట్ అవ్వచ్చు. అందుకే రిస్క్ చేయకుండా వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయండి. గుంటూరు జిల్లాలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులో ఇంకా చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీనివలన వాళ్ళు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇంకా దాదాపు లక్షన్నర రేషన్ కార్డు హోల్డర్లకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. గడువు దగ్గరకు వస్తున్న క్రమంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి.