Hajj Yatra: హజ్ యాత్ర ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Hajj Yatra: ముస్లిం ప్రతీ ఏడాది హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇది వారికి చాలా పవిత్రమైనది. అయితే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ధుల్ హిజ్జా నెల ప్రారంభమైంది. ఈ నెల వారికి చాలా ముఖ్యమైనది. ముస్లింలు సౌదీ అరేబియాలో చంద్రుడిని చూసిన తర్వాత ఈ నెల ప్రారంభం అవుతుంది. అయితే ఇస్లాం మతంలో హజ్ యాత్ర చాలా ముఖ్యమైనది. దీన్ని ఈద్-ఉల్-అధాను బక్రా ఈద్, బక్రీద్, బఖ్రైడ్, ఈద్-ఉల్-జుహా, ఈద్ ఖుర్బాన్, ఖుర్బాన్ బయామి, త్యాగాల పండుగ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఇస్లాం మతం మొత్తం ఐదు స్తంభాల గురించి చెబుతోంది. అందులో హజ్ ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో అల్లాహ్ ఇల్లు ఉన్న కాబాను సందర్శించడమే ఈ హజ్ యాత్ర. ప్రతీ ఏడాది కొన్ని లక్షల మంది ఈ హజ్ యాత్రకు వెళ్తుంటారు. ప్రతీ ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ హజ్ యాత్ర చేయాలని ఇస్లాం మతం చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మక్కాకి వెళ్తారు. అక్కడ ప్రవక్త ముహమ్మద్, ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఆచారాలు పాటిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఇప్పటికే హజ్ యాత్ర ప్రారంభమైంది. ఇస్లాం క్యాలెండర్లో ధుల్ హిజ్జాలో 8వ రోజు నుంచి12వ రోజు వరకు ఈ యాత్ర జరుగుతుంది. జూన్ 4 వ తేదీన హజ్ యాత్ర ప్రారంభమైంది. జూన్ 9వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ హజ్ యాత్రలో ‘అరఫా దినం’ జూన్ 6న ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగను జరుపుకుంటారు.
ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
పవిత్రమైన మక్కాను ప్రతీ ముస్లిం సందర్శిస్తారు. దీనికి ఓ చరిత్ర కూడా ఉంది. ప్రవక్త ఇబ్రహీం స్నేహితుడు, ప్రవక్తల తండ్రి ఇబ్రహీంను అల్లాహ్ ఒక ఆదేశం చేస్తాడు. తన భార్య హాజర్, కొడుకు ఇస్మాయిల్ను మక్కా ఎడారిలో వదిలివేయమని చెబుతాడు. అప్పుడు ఇబ్రహీం తన కుటుంబాన్ని అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు. వారికి కష్టాలు ఎదురు అవుతాయి. హాజర్ సఫా, మార్వా కొండల మధ్య మొత్తం ఏడు సార్లు తిరుగుతారు. కానీ వారికి నీరు కనిపించలేదు. అప్పుడు చిన్న కొడుకు ఇస్మాయిల్ కాలుతో నేలను రుద్దితే ఒక దగ్గర నీటి ఊట కనిపిస్తుంది. దీన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. అక్కడ ఇబ్రహీంను అల్లాహ్ కాబాను నిర్మించి ప్రజలను తీర్థ యాత్రకు రమ్మని ఆహ్వానించాడట. అందుకే కాబాను ఇస్లాంలో పవిత్ర స్థలంగా భావించి హజ్ యాత్రను నిర్వహిస్తారు. ఇబ్రహీం విశ్వాసం, అల్లాహ్ ఆదేశాలను వినడం అన్నింటిని కూడా స్మరించుకుంటూ హజ్ యాత్ర చేస్తారు. అయితే ప్రవక్త ఇబ్రహీం, ఇస్మాయిల్తో కలిసి కాబా నిర్మించాడు. ఈ ప్రదేశంలో అల్లాహ్ను ఆరాధిస్తారు. అయితే మొదటిలో దేవదూత గాబ్రియేల్ తెల్లగా నిర్మించారట. కానీ వేలాది మంది యాత్రికులు ముద్దు పెట్టుకుని తాకడంతో నల్లగా మారిందని చెప్పుకుంటారు. స్వర్గం నుంచి కాబాకు అటాచ్ చేయడానికి తీసుకు వచ్చారని ఖురాన్ చెబుతోంది. అయితే మొదటి సారిగా ముహమ్మద్ క్రీ.శ. 632 లో హజ్ తీర్థయాత్ర చేశారు. అరఫా మైదానంలో గుమిగూడిన వేలాది మంది ముస్లింలకు తన ప్రసిద్ధ వీడ్కోలు ఉపన్యాసం ఇచ్చారు. అలా హజ్ ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా మారింది. అప్పటి నుంచి హజ్ యాత్రను కొనసాగిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.