Planet Parade: మహా శివరాత్రి తర్వాత ఆకాశంలో అద్భుతం.. వరుసగా సప్త కూటమి

Planet Parade:
మహా శివరాత్రి తర్వాత ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. ఇప్పుడు ఈ అద్భుతాన్ని చూడకపోతే మళ్లీ 15 ఏళ్ల తర్వాత దీన్ని భారత్లో చూడవచ్చు. అయితే మహా శివరాత్రి తర్వాత ఫిబ్రవరి 28వ తేదీన ఆకాశంలో ఓ అద్భుతం కనిపిస్తోంది. మొత్తం ఏడు గ్రహాలు వరుసలోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సప్త కూటమి ఆకాశంలో అద్భుతంగా కనిపిస్తుంది. మన దేశంలో ఈ సప్త కూటమి చాలా క్లియర్గా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బుధుడు, శుక్రుడు, శని, అంగారకుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు అన్ని కూడా వరుసగా ఆకాశంలో దర్శనమిస్తాయి. దీన్ని ప్లానెట్ పరేడ్గా (Planet Parade) ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తారు. అయితే దీన్ని ఫిబ్రవరి 28న ఇండియాలో ఈజీగా చూడవచ్చు. ఎలాంటి టెలిస్కోప్ లేకుండా ఇంతటి ఖగోళ అద్భుతాన్ని చూడవచ్చని అంటున్నారు. అయితే ఇంతటి అద్భుతమైన సప్త కూటమిని కేవలం భారత్లోనే కాకుండా అమెరికా, మెక్సికో, కెనడాలో దేశాల్లో కూడా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్లానెట్ పరేడ్ గత నెలలో కూడా ఆకాశంలో దర్శనమిచ్చింది. మళ్లీ ఇప్పుడు ఆ ప్లానెట్ పరేడ్ మళ్లీ ఆకాశంలో దర్శనమివ్వనుంది. అయితే ఈ సప్త కూటమిలో ఐదు గ్రహాలు ఎలాంటి బైనాక్యులర్స్ లేకుండా డైరెక్ట్గా చూడవచ్చు. మిగతా రెండు గ్రహాలు చూడటానికి మాత్రం తప్పకుండా టెలిస్కోప్ ఉండాలి.
ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 21వ తేదీన ఆకాశంలో ప్లానెట్ పరేడ్ కనువిందు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మొత్తం ఆరు గ్రహాలు ఆకాశంలో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. వీనస్, మార్స్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. ఈ ప్లానెట్ పరేడ్ అని ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు ఆకాశంలో కనిపించింది. ఈ ప్లానెట్ పరేడ్ కోసం గురుగ్రామ్, ముంబై, డెహ్రాడూన్లో సెషన్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు ఆకాశంలో అద్భుతం కనిపించబోతుంది. అయితే మహా శివరాత్రి తర్వాత ఇలా జరగడంతో అందరూ కూడా దీన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి ఈ అద్భుతాన్ని ఆకాశంలో చూడాలని అనుకుంటున్నారు. అసలు మిస్ కాకుండా ఈ అద్భుతాన్ని తప్పకుండా ఆకాశంలో చూడండి.