Those two behind Punjab Kings: పంజాబ్ కింగ్స్ వెనుక ఆ ఇద్దరు.. వారి వల్లే టాప్ 2 ప్లేస్ సొంతం
Those two behind Punjab Kings: గత పది సీజన్లలో కేవలం ఐదు స్థానాల్లో ఉన్న పంజాబ్ జట్టు టాప్ 2 రేసులో ఉండటానికి ముఖ్య కారం ఇద్దరు. వాళ్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్. అయితే శ్రేయస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు మెగా వేలంలో కొనుగోలు చేసింది.

Those two behind Punjab Kings: ఐపీఎల్ సీజన్ 2025లో ప్లేఆఫ్స్కు చేరిన జట్లులో పంజాబ్ కింగ్స్ ఒకటి. దాదాపుగా 11 ఏళ్ల తర్వాత ఈ జట్టు టాప్ లో ప్లేస్ సంపాదించుకుంది. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్లు గెలిచింది. అలాగే వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అయ్యింది. ఇప్పుడు టాప్ 2లో స్థానం సంపాదించి క్వాలిఫయర్ 1లో ఆడనుంది. అయితే గత పది సీజన్లలో కేవలం ఐదు స్థానాల్లో ఉన్న పంజాబ్ జట్టు టాప్ 2 రేసులో ఉండటానికి ముఖ్య కారం ఇద్దరు. వాళ్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్. అయితే శ్రేయస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు మెగా వేలంలో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ప్లేయర్లను టీమ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ చేతిలో పెట్టడమే ఈ రోజు టాప్ 2 ప్లేస్లో ఉంది.
ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ తన మార్క్ జట్టును ఎంపిక చేసినప్పుడే చూపించాడు. గత సీజన్లో ఢిల్లీ జట్టుకు బాధ్యతలు నిర్వర్తించగా ఈసారి పంజాబ్ జట్టుకు బాధ్యత వహించాడు. శశాంక్, అర్ష్దీప్ను ఈ జట్టు రిటైన్ చేసుకోవడంతో ప్లాన్ ఉందని అందరూ భావించారు. అప్పుడు శశాంక్ కూడా టాప్-2లో పంజాబ్ జట్టు ఉంటుందని చెప్పాడు. భారీ మొత్తంలో శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసింది. గత సీజన్లో కేకేఆర్ను శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ విన్నింగ్స్ క్రెడిట్స్ అన్ని కూడా గౌతమ్ గంభీర్కు వెళ్లాయి. ప్రభ్ సిమ్రన్, నేహాల్ వధేరా, శశాంక్, జోష్ ఇంగ్లిస్ వంటి ప్లేయర్లతో పాటు టాప్ బౌలర్ అర్ష్దీప్ సింగ్, యాన్సెన్, వైశాఖ్ విజయ్ కుమార్, టాప్ వికెట్ టేకర్ యుజ్వేంద్ర చాహల్ను మెగా వేలంలో తీసుకుంది. అలాగే హర్మన్ప్రీత్ను జట్టు తీసుకుంది.
జట్టును ముందుకు సరిగ్గా నడిపించిన తీరులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు వంద మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్లు ఆడాడు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ను కూడా మార్చాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో రాకుండా జోష్ ఇంగ్లిస్ను పంపించి అతడితో కీలక ఇన్నింగ్స్ ఆడించాడు. డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు బౌలర్లు కూడా సపోర్ట్గా నిలిచాడు. టాప్-2లోకి పంజాబ్ చేరుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్ల ఆల్ రౌండ్ ప్రదర్శన ఉంది. టాప్-5 బ్యాటర్లలో జట్టుకు చెందిన ఒక్క ఆటగాడూ లేడు. అయినా భారీ స్కోర్లు చేసింది. లక్ష్యాలను ఛేదించింది. 514 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ మాత్రమే టాప్-5 బౌలర్లలో పంజాబ్ నుంచి చోటు దక్కించుకున్నాడు. అతడు 14 మ్యాచుల్లో 18 వికెట్లు తీశాడు. అతడితో పాటు మార్కో యాన్సెన్ 16 వికెట్లు పడగొట్టాడు.
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!
-
Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్కు వరుణుడి ముప్పు
-
IPL 2025 : ఫైనల్లో ‘ముస్తాక్ అలీ ట్రోఫీ’ రిపీట్ అవుతుందా? అయ్యర్ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా ?
-
IPL 2025 Final : అయ్యర్, పాటిదార్లకు రికార్డు సృష్టించే సువర్ణావకాశం.. ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయేనా?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు