Viral Video : తమిళనాడు తీరంలో చిక్కిన అరుదైన ఒర్ఫిష్.. భయాందోళనలో మత్స్యకారులు!

Viral Video :సముద్రం అంతులేని రహస్యాలకు నెలవు. అప్పుడప్పుడూ బయటపడే కొన్ని వింత జీవులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇటీవల, తమిళనాడు మత్స్యకారుల వలలో చిక్కిన ఒక అరుదైన ఒర్ఫిష్ (Oarfish) చేప సోషల్ మీడియాలో (Social Media) పెద్ద చర్చకు దారితీసింది. వెండి రంగులో, రిబ్బన్ లాగా కనిపించే ఈ చేప దాదాపు 30 అడుగుల వరకు పెరుగుతుంది. దీని తలపై ఎరుపు రంగులో ఒక ప్రత్యేకమైన ఫిన్ (ఈక) ఉంటుంది. సాధారణంగా ఇది సముద్రపు లోతుల్లోనే (Deep Sea) కనిపిస్తుంది. కానీ, ఇది ఉపరితలంపై కనిపించడం ఆసక్తిని, ఆందోళనను రెండింటినీ పెంచింది. ఎందుకంటే చాలా మంది దీనిని సహజ విపత్తులకు సంకేతంగా భావిస్తారు.
ఒర్ఫిష్ను లేదా రిబ్బన్ఫిష్ను (Ribbonfish) ‘డూమ్స్డే ఫిష్’ (Doomsday Fish) అని కూడా అంటారు. జపాన్ (Japan), ఫిలిప్పీన్స్ (Philippines) దేశాల్లో ఒక నమ్మకం ఉంది. ఏదైనా పెద్ద విపత్తు రాబోతున్నప్పుడు మాత్రమే ఈ చేప సముద్ర ఉపరితలంపైకి వస్తుంది. ఈ చేప కనిపించడం అంటే భూకంపాలు (Earthquakes) లేదా సునామీలు (Tsunamis) వంటి ప్రకృతి విపత్తులకు సంకేతం కావచ్చని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. జపాన్ జానపద కథల్లో (Japanese Folklore) దీనిని ‘భూకంపాల అగ్రదూత’ అని పిలుస్తారు. ఈ కారణంగానే ఒర్ఫిష్కు ‘ప్రళయపు చేప’ అనే పేరు వచ్చింది.
Read Also:Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్
🚨 A rare oarfish—aka the “Doomsday Fish”—has surfaced off the coast of Tamil Nadu, India 🌊
This deep-sea creature can grow over 36 feet and is tied to ancient legends of surfacing before earthquakes & tsunamis. Coincidence or omen? 👀🐉#Oarfish #OceanMysteries #India pic.twitter.com/BM8hDhXKqW
— Paulose Jacob Peter (@Anand02908794) June 1, 2025
చారిత్రక సంఘటనలు
2011 జపాన్ భూకంపం-సునామీ: జపాన్లో విధ్వంసకర భూకంపం, సునామీ రాకముందు డజన్ల కొద్దీ ఒర్ఫిష్లు కనిపించాయి.
2017 ఫిలిప్పీన్స్ భూకంపం: ఫిలిప్పీన్స్లో భూకంపం రాకముందు రెండు ఒర్ఫిష్లు కనిపించాయి.
మెక్సికోలో భూకంపం: ఇదే విధంగా మెక్సికోలో కూడా ఒర్ఫిష్ కనిపించిన తర్వాత ఒక పెద్ద భూకంపం వచ్చింది.
ఈ సంఘటనలు ప్రజల నమ్మకాలను మరింత బలపరిచాయి.
అయితే, శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా ఖండించారు. 2019లో ‘బులెటిన్ ఆఫ్ సిస్మోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఒర్ఫిష్ ఉనికికి, భూకంపాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలింది.
Read Also:Viral video : ఈవిడకు నాలుగైదు గుండెలుంటాయి.. ఎంత ధైర్యంగా సింహానికి స్నానం పోస్తుందో చూడండి
ఇప్పుడు తమిళనాడులో ఈ చేప కనిపించిన తర్వాత, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు ఈ చేపను చూసి రాబోయే విపత్తుల గురించి ఆందోళన చెందుతుంటే, మరికొందరు శాస్త్రీయ దృక్పథంతో మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏదేమైనా, ఈ అరుదైన చేప కనిపించడం మాత్రం ప్రజల్లో ఆసక్తిని, భయాన్ని కలిగించింది.