Railway: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. పెరగనున్న టికెట్ ధరలు

Railway: దేశంలో రైలు ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారు. మిడిల్ క్లాస్కి చెందిన వారు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ట్రైన్లోనే జర్నీ చేస్తారు. రైలు ప్రయాణం తక్కువ బడ్జెట్తో పూర్తి కావడంతో పాటు సేఫ్ ఉంటుందని భావిస్తుంటారు. ఎందుకంటే బస్సులు అయితే యాక్సిడెంట్లు అవుతాయి. ఈ మధ్య కాలంలో ట్రైన్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కానీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతుంటాయి. ఈ కారణంగానే చాలా మంది రైలు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే రైలు ప్రయాణాలు చేసే వారికి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే రైలు ఛార్జీలు కాస్త తక్కువగా ఉంటాయి. జనరల్, స్లీపర్, ఏసీ బట్టి మారుతుంది. ఫ్లైట్ ఛార్జీలతో పోలిస్తే ఇవి తక్కువగానే ఉంటాయి. అయితే ఇప్పుడు రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపింది. అయితే తక్కువ దూరం కాకుండా ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వేల కొత్త టారిఫ్ ప్రకారం జనరల్ సెకండ్ క్లాస్లో 500 కి.మీ వరకు ప్రయాణించడానికి ఎలాంటి ఛార్జీల పెరుగుదల కూడా ఉండదు. అదే 500 కి.మీ కంటే ఎక్కువగా ప్రయాణం చేస్తే మాత్రం తప్పకుండా ప్రతీ కి.మీ.కు అర పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇవే కాకుండా మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారు కూడా కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏసీ క్లాస్లో ప్రయాణించే వారు కిలోమీటరుకు 2 పైసలు చెల్లించాలి. అయితే సబ్బరన్ రైళ్లలో అయితే ఛార్జీల విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. అలాగే కొందర నెల వారీగా పాస్ తీసుకుంటారు. ఈ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు కూడా లేదు. అయితే రైల్వే శాఖ వీటితో పాటు మరికొన్ని మార్పులు చేయనుంది. రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో కూడా మార్పులు చేస్తుంది. ఇప్పటివరకు మీరు రైలు టికెట్ బుక్ చేసుకుంటే, టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. మీ ప్రయాణానికి నాలుగు గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫైనల్ చార్ట్ ప్రయాణానికి 24 గంటల ముందే తెలుస్తుందని రైల్వే శాఖ చెబుతోంది. అయితే తత్కాల్ విషయంలో కూడా మరో రూల్ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఆధార్ అథంటికేషన్ ఉన్నవాళ్లు తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ రూల్స్ అన్ని కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.