Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Railways Charges Increased For Train Tickets

Railway: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. పెరగనున్న టికెట్ ధరలు

Railway: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. పెరగనున్న టికెట్ ధరలు
  • Edited By: kusuma,
  • Updated on June 24, 2025 / 05:33 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Railway: దేశంలో రైలు ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారు. మిడిల్ క్లాస్‌కి చెందిన వారు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ట్రైన్‌లోనే జర్నీ చేస్తారు. రైలు ప్రయాణం తక్కువ బడ్జెట్‌తో పూర్తి కావడంతో పాటు సేఫ్ ఉంటుందని భావిస్తుంటారు. ఎందుకంటే బస్సులు అయితే యాక్సిడెంట్లు అవుతాయి. ఈ మధ్య కాలంలో ట్రైన్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కానీ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతుంటాయి. ఈ కారణంగానే చాలా మంది రైలు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే రైలు ప్రయాణాలు చేసే వారికి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే రైలు ఛార్జీలు కాస్త తక్కువగా ఉంటాయి. జనరల్, స్లీపర్, ఏసీ బట్టి మారుతుంది. ఫ్లైట్ ఛార్జీలతో పోలిస్తే ఇవి తక్కువగానే ఉంటాయి. అయితే ఇప్పుడు రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపింది. అయితే తక్కువ దూరం కాకుండా ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వేల కొత్త టారిఫ్ ప్రకారం జనరల్ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించడానికి ఎలాంటి ఛార్జీల పెరుగుదల కూడా ఉండదు. అదే 500 కి.మీ కంటే ఎక్కువగా ప్రయాణం చేస్తే మాత్రం తప్పకుండా ప్రతీ కి.మీ.కు అర పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇవే కాకుండా మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారు కూడా కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏసీ క్లాస్‌లో ప్రయాణించే వారు కిలోమీటరుకు 2 పైసలు చెల్లించాలి. అయితే సబ్బరన్ రైళ్లలో అయితే ఛార్జీల విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. అలాగే కొందర నెల వారీగా పాస్ తీసుకుంటారు. ఈ టికెట్‌ల ధరల్లో ఎలాంటి మార్పు కూడా లేదు. అయితే రైల్వే శాఖ వీటితో పాటు మరికొన్ని మార్పులు చేయనుంది. రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో కూడా మార్పులు చేస్తుంది. ఇప్పటివరకు మీరు రైలు టికెట్ బుక్ చేసుకుంటే, టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. మీ ప్రయాణానికి నాలుగు గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫైనల్ చార్ట్ ప్రయాణానికి 24 గంటల ముందే తెలుస్తుందని రైల్వే శాఖ చెబుతోంది. అయితే తత్కాల్ విషయంలో కూడా మరో రూల్ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఆధార్ అథంటికేషన్ ఉన్నవాళ్లు తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ రూల్స్ అన్ని కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.

Tag

  • AC coach
  • Charges
  • Increase
  • Indian Railways
  • Sleeper
Related News
  • Viral Video : రైలులో సీటు కోసం రచ్చ.. ప్రయాణీకుల మధ్య వాగ్వాదం

  • RBI : ఆర్‌బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఛార్జీలు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us