Bhairavam Boycott : ట్రెండ్ అవుతున్న భైరవం బాయ్ కాట్.. ఎందుకోసమంటే?
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలిసి నటిస్తున్న మూవీ ‘భైరవం’. మే 30వ తేదీన భైరవం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bhairavam Boycott: విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలిసి నటిస్తున్న మూవీ ‘భైరవం’. మే 30వ తేదీన భైరవం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కూడా జోరుగా సాగుతుంది. కానీ ఇంతలోనే ప్రేక్షకులు మూవీకి షాక్ ఇచ్చారు. సినిమా ప్రమోషన్ బాగా జరుగుతుందనుకున్న సమయంలో అంతా కూడా రివర్స్ జరిగింది. దర్శకుడు అన్ని చిన్న మాటకు సోషల్ మీడియాలో మూవీని బాయ్ కాట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం బైరవం బాయ్ కాట్ అనేది ట్రెండ్ అవుతుంది. దర్శకుడు చేసిన చిన్న పొరపాటు వల్ల సినిమా ప్రభావం చూపనుంది.
Read Also: ప్లే ఆఫ్స్కు చేరిన ఆర్సీబీకి తప్పని భయం.. ఆందోళనలో ఫ్యాన్స్
సాధారణంగా సినిమాలు, రాజకీయాలను మిక్స్ చేయవద్దని డైరెక్ట్ గా చెప్తూ ఉంటారు. మళ్ళీ వాలే రాజకీయాలు, సినిమాలను కలిపి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒక లైలా మూవీకి ముందు కూడా నటుడు విజయ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనితో అప్పుడు కూడా లైలా బాయ్ కాట్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. మళ్లీ ఇప్పుడు డైరెక్టర్ విజయ్ కనకమెడల అది మిస్టేక్ చేశారు. డైరెక్టర్ చేసిన వ్యాఖ్యల కారణంగా బాయ్ కాట్ భైరవం అనే ట్రెండ్ ను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. భైరవ మూవీలో ధర్మం కావడం కోసం ఎప్పుడో ఎవరో ఒకరు వస్తుంటారు. మన రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు అని కనకమెడల విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వైసీపీ శ్రేణులు బాయికాట్ బైరవం అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. లైలా మూవీ లానే బైరవం కూడా డిజాస్టర్ అవుతుంది ఏమోనని భయపడుతున్నారు. ఏదేమైనా విజయ్ కనకమేడల కాస్త ఆలోచించి మాట్లాడాల్సింది.
Read Also: వడదెబ్బకు చెక్ పెట్టే బేల్ షర్బత్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
భైరవం మూవీ ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇందులో మంచు మనోజ్ నెగిటివ్ రోల్ చేయగా.. నారా రోహిత్ పవర్ ఫుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ అని ట్రైలర్తో తెలుస్తోంది. సినిమాలో డైలాగ్లు కూడా బాగా రాసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేస్తారు. మొదట్లో సాధారణంగానే ఉన్న చివరిలో మాత్రం రక్తపాతంతో తడిపేస్తారు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడటం కోసం ఏదో ఒక రూపంలో దేవుడు వస్తాడని చెబుతాడు. అదే సమయంలో బెల్లం కొండ శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తాడు. ఈ డైలాగ్ను విజయ్ కనకమేడల అనడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.