UAE Attracts Rich : కోటీశ్వరులంతా ఆ ముస్లిం దేశానికే ఎందుకు వెళ్తున్నారు?

UAE Attracts Rich : ఒకప్పుడు కొన్ని పశ్చిమ దేశాలు, స్విట్జర్లాండ్ వంటివి ధనవంతులను ఎక్కువగా ఆకర్షించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చాలా మంది కోటీశ్వరులు ఇప్పుడు ఒక ముస్లిం దేశానికి క్యూ కడుతున్నారు. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఈ విషయం మన భారతదేశానికి కూడా కొంత ఆందోళన కలిగించేదే. ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు భారీ ఎత్తున తమ దేశాలను విడిచి వేరే చోట్లకు వెళ్తున్నారు. 2025లో సుమారు 1,42,000 మంది కోటీశ్వరులు ఇలా కొత్త దేశాలకు మారతారని అంచనా. ఈ సంఖ్య 2026 నాటికి 1,65,000కు పెరుగుతుందని చెబుతున్నారు. చాలామంది సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలకు వెళ్తున్నారని అనుకుంటారు. కానీ హెన్లీ ప్రైవేట్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం అత్యధిక సంఖ్యలో ధనవంతులు వెళ్తున్న దేశం దుబాయ్.
ఈ సంవత్సరం యూఏఈకి 9,800 మంది కోటీశ్వరులు వస్తారని అంచనా. ఇది 2024 కంటే 5.8శాతం ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే ధనవంతులు ఎక్కువగా ఇష్టపడుతున్న దేశంగా యూఏఈ నిలిచింది. అమెరికా 7,500 మందితో రెండో స్థానంలో ఉంది. ఇటలీ (2,200), స్విట్జర్లాండ్ (1,500), సౌదీ అరేబియా (2,400) కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, సింగపూర్, పోర్చుగల్ వంటి దేశాలు కూడా పెట్టుబడి విధానాల ద్వారా ధనవంతులను ఆకర్షిస్తున్నాయి.
Read Also:Toll Charges For Bikes: బైక్లకు టోల్ ట్యాక్స్.. కేంద్రం ఏం చెప్పిందంటే?
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, యూఏఈ మాత్రం ధనవంతులకు చాలా సురక్షితమైన ప్రదేశంగా నిలుస్తోంది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. యూఏఈలో వ్యక్తిగత ఆదాయంపై పన్ను ఉండదు. ఇది ధనవంతులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎందుకంటే వారు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని పన్నుల రూపంలో కోల్పోరు. అక్కడ పెట్టుబడిదారులకు చాలా ఈజీ, ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఉన్నాయి. వ్యాపారాలు పెట్టడానికి, నివాసం ఏర్పరచుకోవడానికి ఇవి తోడ్పడతాయి.
యూఏఈకి రాజకీయంగా స్థిరమైన, శాంతియుత దేశంగా మంచి పేరుంది. ఇది పెట్టుబడులకు, నివాసం ఉన్నోళ్లకు భద్రతను అందిస్తుంది. దుబాయ్ వంటి నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు (రోడ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, లగ్జరీ నివాసాలు) ఉన్నాయి. అలాగే, అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా ప్రయాణించవచ్చు.
Read Also:Healthy Foods: ఈ 6 రకాల ఫుడ్స్ తీసుకుంటే.. వందేళ్లు జీవించడం గ్యారెంటీ
ప్రాంతీయ సంక్షోభాల సమయంలో కూడా యూఏఈ ధనవంతులను ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఎందుకంటే, ఇది ఆర్థిక భద్రతతో పాటు విలాసవంతమైన జీవనాన్ని కూడా అందిస్తుంది. ఈ ధనవంతుల వలస వల్ల భారతదేశం 2025లో 3,500 మంది కోటీశ్వరులను కోల్పోతుందని అంచనా. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ధోరణే. అంటే, మన దేశంలోని సంపద కొంతవరకు బయటకు వెళ్తోందని అర్థం. అయితే, భవిష్యత్తులో మన పన్ను విధానాల్లో మార్పులు లేదా కొందరు తిరిగి వలస రావడం వంటివి ఈ ధోరణిని ప్రభావితం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ధనవంతులు ఒక దేశం నుంచి వెళ్ళిపోవడం ఆ దేశ ఆర్థిక స్థితికి ఒక సూచికగా కూడా ఉంటుంది. యూఏఈ మాత్రం ప్రపంచంలోని ధనవంతులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. మన దేశంలోని కోటీశ్వరులు కూడా అటువైపే చూస్తున్నారు.