Old Vehicles Ban : మీ బండి కొని పదేళ్లు దాటిందా… అయితే ఇక బంకు వాళ్లు మీకు పెట్రోల్ పోయరు

Old Vehicles Ban : ఢిల్లీలో కాలుష్యం కట్టడికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. జూలై 2025 నుంచి 15 సంవత్సరాలకు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 సంవత్సరాలకు పైబడిన డీజిల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఫ్యూయెల్ నింపడం పూర్తిగా నిలిపివేసింది. ఈ వాహనాలను గుర్తించడానికి ఇంధనం నింపే స్టేషన్లలో స్మార్ట్ కెమెరాలను అమర్చే పని దాదాపు పూర్తయ్యింది. అంటే, ఇకపై ఈ పాత వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ లభించదు.
ఈ సంవత్సరం ఏప్రిల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) ఢిల్లీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూలై 1 నుంచి అన్ని పాత వాహనాలకు ఇంధనం సరఫరా నిలిపివేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. దీని అర్థం, 10 సంవత్సరాలకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలకు పైబడిన పెట్రోల్ వాహనాల యజమానులు జూలై 1 నుంచి ఢిల్లీలోని ఇంధన స్టేషన్ల నుండి ఇంధనం కొనుగోలు చేయలేరు. ఈ ఆదేశాల ప్రకారం ఢిల్లీలోని అన్ని ఫ్యూయెల్ స్టేషన్లలో జూన్ 30 నాటికి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ (ANPR) కెమెరాలను అమర్చాలి. ఈ వ్యవస్థ పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను గుర్తించగలదు.
Read Also:Atal Pension Yojana : అదిరిపోయే స్కీమ్.. రూ.376కడితే చాలు.. ప్రతినెలా రూ.5000 పెన్షన్
వాహనదారులపై చట్టపరమైన చర్యలు
ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) ఆదేశాల తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం రవాణా శాఖ ఒక బహిరంగ నోటీసులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా ఫ్యూయెల్ స్టేషన్లలో అమర్చిన కెమెరాల ద్వారా పాతబడిపోయిన వాహనాలను గుర్తించి, అటువంటి వాహనాలకు పెట్రోల్-డీజిల్ ఇచ్చేది లేదని తెలిపింది. అంతేకాకుండా, మోటారు వాహన చట్టం 1989 ప్రకారం ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. “పాత వాహనాలను ఎన్సీఆర్ (National Capital Region) నుంచి బయటకు తీసుకెళ్లడానికి లేదా ఏదైనా సెంటర్లో వాహనాలను స్క్రాప్ చేయడానికి రవాణా శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) తీసుకోవడం తప్పనిసరి” అని నోటీసులో పేర్కొంది.
కెమెరాలు అమర్చే పని దాదాపు పూర్తి
ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) ఆదేశాలు 2018 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చింది. ఆ తీర్పులో ఢిల్లీలో 10 సంవత్సరాలకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలకు పైబడిన పెట్రోల్ వాహనాలపై నిషేధం విధించబడింది. 2014లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశంలో కూడా నగర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో 15 సంవత్సరాలకు పైబడిన వాహనాలను పార్కింగ్ చేయడాన్ని నిషేధించారు. కెమెరాలను అమర్చే పని దాదాపు పూర్తయిందని ఢిల్లీ రవాణా శాఖకు చెందిన ఒక ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపారు. కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మాదిరే త్వరలోనే ఇతర రాష్ట్రాల్లోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.
Read Also:Lunch Box : ఆఫీసుకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఈ లంచ్ బాక్స్ ఉంటే మైక్రోవేవ్ అక్కర్లేదు!