Eng Vs Ind 4th Test: పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తాడా…
Eng Vs Ind 4th Test క్రీజులో కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగులు వెనకబడి ఉంది. నేడు ఆటకు చివరి రోజు.

Eng Vs Ind 4th Test: మాంచెస్టర్ టెస్టులో టీమిండియాలో కష్టాల్లో ఉంది. అయితే రెండు ఇన్నింగ్స్ లో పంత్ బ్యాటింగ్ కు దిగనున్నాడని కోచ్ సితాన్షు కొటక్ పరోక్షంగా చెప్పాడు. కాలికి తీవ్ర గాయమైనా తొలి ఇన్నింగ్స్ లో పంత్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు జట్టు కష్టాల్లో ఉంది కాబట్టి అతడు తప్పకుండా క్రీజులోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు లో బ్యాటింగ్ చేస్తుండగా పంత్ కు గాయమైంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా పోరాటం చేస్తుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
క్రీజులో కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ ఉన్నారు. భారత్ ఇంకా 137 పరుగులు వెనకబడి ఉంది. నేడు ఆటకు చివరి రోజు. ఈ టెస్టులో టీమిండియాలో ఓడిపోకుండా ఉండాలంటే కనీసం రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాలి. అయితే గిల్, రాహుల్ తర్వాత ప్రధాన బ్యాటర్ గా ఉంది రిషబ్ పంత్ మాత్రమే. జట్టు కోసం పంత్ తప్పకుండా బ్యాటింగ్ చేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
-
Rishabh Pant: దేశం కోసం గెలవండి.. రిషబ్ పంత్ ఆసక్తికర ట్వీట్
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ పై ఫ్యాన్స్ ఫైర్
-
Narayan Jagadeesan: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్ జగదీశన్
-
Sai Sudarshan: పంత్ గాయంపై సాయి సుదర్శన్ ఏమన్నాడంటే
-
Rishabh Pant Injury: పంత్ పై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్