IPL 2025: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
IPL 2025: ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఎన్సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో బుమ్రా బౌలింగ్ వేయలేకపోతున్నాడు.

IPL 2025 : ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులోని స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా జట్టులోకి ఎంట్రీ కాస్త ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా ప్రారంభ మ్యాచ్లకు కాస్త దూరంగా ఉంటాడని రిపోర్ట్లు చెప్పాయి. చెప్పినట్లుగానే మొదటి మ్యాచ్లకు రాలేదు. ఇప్పుడు ఇంకా రెండు వారాల సమయం పట్టేలా ఉందని అంటున్నారు. ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఎన్సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో బుమ్రా బౌలింగ్ వేయలేకపోతున్నాడు. ఇలా ప్రాక్టీస్ సమయంలో కూడా మళ్లీ ఎలాంటి ఫ్రాక్చర్ కాకుండా ఉండేందుకు బుమ్రా జాగ్రత్త పడుతున్నాడు. రోజురోజుకీ వర్క్ లోడ్ కూడా పెంచుతున్నాడు. అయితే దీని బట్టి చూస్తే బుమ్రా మళ్లీ జట్టులోకి చేరాలంటే ఇంకో రెండు వారాల సమయం వేచి ఉండాల్సిందే.
ఇదెలా ఉండగా.. జనవరి మొదటివారంలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది. ఈ టోర్నీలో చివరి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా గాయపడ్డాడు. మ్యాచ్ మధ్యలో మైదానం నుంచి వెళ్లిపోయాడు. వెంటనే మన దేశానికి వచ్చి బెంగళూరులో చికిత్స తీసుకున్నాడు. అంతా బానే ఉందని మళ్లీ తొందరలోనే బుమ్రా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయం దగ్గరకి వచ్చినా సరే బుమ్రా గాయం నుంచి కోలుకోలేక పోయాడు. బుమ్రాకి ఎలాంటి ఇబ్బంది కూడా లేకపోయినా బౌలింగ్ అయితే చేయకూడదని వైద్యులు తెలిపారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరం అయ్యాడు. ఇతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. ఏది ఏమైనా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అయితే ఐపీఎల్ సీజన్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సమయంలో జట్టులో బుమ్రా తప్పకుండా ఉండాలి. అందుకే బుమ్రాను ఐపీఎల్కి పంపించడం లేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మళ్లీ ఐపీఎల్లో ఆడుతున్న సమయంలో గాయం ఎక్కువ అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఇబ్బంది అవుతుందని బీసీసీఐ భావిస్తోంది.
ఇదిలా ఉండగా ముంబై జట్టు ఐపీఎల్లో మొత్తం మూడు మ్యాచ్లు ఆడింది. ఇందులో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. కోల్కతాతో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మొదటి నుంచి బౌలింగ్, బ్యాటింగ్లో సత్తా చాటింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ట్రోఫీ గెలిచింది. కానీ ఈ సీజన్లో రెండు మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది.
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
-
Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Virat Kohli Sensational Comments Rohit: రోహిత్పై కోహ్లీ సంచలన కామెంట్స్.. ఇంపాక్ట్ చూపించడం లేదంటూ..?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!