Jitesh Sharma: రికార్డు సృష్టించిన జితేష్ శర్మ.. ధోని రికార్డును బద్దలు కొట్టి..!
ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నోపై గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఆర్సీబీ ఓడించింది.

Jitesh Sharma: ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నోపై గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఆర్సీబీ ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2కు చేరింది. అయితే గురువారం క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వాలిఫైయర్ 1కి అర్హత సాధించింది. అయితే ఆర్సీబీ విన్ కావడానికి ముఖ్యకారణం జితేష్ శర్మ. విన్నింగ్ షాట్స్తో జితేష్ శర్మ మ్యాచ్ను గెలిపించాడు. లక్నో జట్టు భారీ స్కోర్ను ఆర్సీబీ ముందు ఉంచింది. అయినా కూడా ఆర్సీబీ జట్టు తగ్గకుండా ఆడింది. ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ (30), విరాట్ కోహ్లీ (54) స్కో్ర్ చేశారు. జితేష్ శర్మ చేసిన 85 పరుగుల స్కోరు చేశారు. అయితే ఐపీఎల్లో 6వ నంబర్ లేదా అంతకంటే తక్కువ బ్యాట్స్మన్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోనిపై ఉంది. ఐపీఎల్ 2018 సీజన్లో 34 బంతుల్లో 70 పరుగులు ధోనీ ఆర్సీబీపై చేశాడు.
Read Also: కండరాల బలహీనత, ఆస్తమాకు ఈ 5 ఆహారాలతో చెక్ పెట్టేయండి
ఇదిలా ఉండగా ఉత్కంఠంగా ఈ మ్యాచ్ చివరి వరకు సాగింది. ఈ మ్యాచ్లో జితేష్ కొట్టిన సిక్సర్ తో బెంగళూరు జట్టు గెలిచింది. దీంతో ఆర్సీబీ జట్టు ఆనందంలో మునిగి తేలింది. ఆటగాళ్లు ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. జితేష్ శర్మ సిక్సర్ కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ అయితే ఆనందంతో ఒక్కసారిగా ఎగిరి గంతులు వేశాడు. పక్కనే ఉన్న కృణాల్ పాండ్యాను గట్టిగా హత్తుకున్నాడు. టాప్ 2లోకి వెళ్లిపోయామని హ్యాపీ ఫీల్ అయ్యాడు. బెంగళూరు మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి విరాట్ కోహ్లీ బయటకు వచ్చి మైదానంలోకి వెళ్లాడు. అక్కడ జితేష్ శర్మకు శుభాకాంక్షలు తెలియజేసి హగ్ చేసుకున్నాడు. జట్టును గెలిపించినందుకు థాంక్స్ అంటూ చెప్పాడు. బెంగళూరు జట్టును గెలిపించావని విరాట్ కోహ్లీ జితేష్ శర్మను ఉద్దేశించాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా ఆడాడు. అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ఉంచినప్పటికీ ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది.
Read Also: ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఔట్
అలాగే మ్యాచ్ గెలవడంతో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తోటీ ప్లేయర్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ విన్నింగ్తో ఆర్సీబీ ఫ్యా్న్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో పాటు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ సైగలు చేస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు. ఆ తర్వాత అనుష్క శర్మ కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. వీరిద్దరి ప్రేమ ఎంత బాగుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి వీరిని గ్రౌండ్ లో చూడటానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు.
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
IPL 2025 Final: రిజర్డ్వ్ డే రోజు వర్షం పడితే.. విన్నర్ ఇక ఆ జట్టే!
-
Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్కు వరుణుడి ముప్పు
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు
-
IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ కు వరుణ గండం.. మోదీ పిచ్ ఎవరికీ కలిసొస్తుంది ?
-
IPL 2025: ఫైనల్కు వెళ్లిన సంతోషమే లేదు.. శ్రేయస్ అయ్యర్కు బిగ్ షాక్