Shreyas Iyer : కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ రికార్డు
Shreyas Iyer : ఐపీఎల్ చరిత్రలో ధోనీ పేరు మీద ఉన్న రికార్డును శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా వరుసగా ఏడు విజయాలు సాధించాడు. ఈ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. వరుసగా ఎనిమిది విజయాలను సాధించాడు. ఇప్పటి వరకు ధోని ఏడు విజయాలు సాధించగా.. శ్రేయస్ అయ్యర్ ఎనిమిది విజయాలు సాధించాడు.

Shreyas Iyer : టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సరికొత్త ఘనతను సాధించాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో తిరుగులేని కెప్టెన్గా ఉన్నాడు. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్కి టైటిల్ అందించిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మరో రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ధోనీ పేరు మీద ఉన్న రికార్డును శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా వరుసగా ఏడు విజయాలు సాధించాడు. ఈ రికార్డును శ్రేయాస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. వరుసగా ఎనిమిది విజయాలను సాధించాడు. ఇప్పటి వరకు ధోని ఏడు విజయాలు సాధించగా.. శ్రేయస్ అయ్యర్ ఎనిమిది విజయాలు సాధించాడు. అలాగే ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన మూడో కెప్టెన్గా నిలిచాడు. ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ మొత్తం 72 మ్యాచ్లకు సారథ్యం వహించాడు. 55.55 శాతం విజయాలు సాధించాడు. అయితే ఈ ఘనతలో ముంబై ఇండియ్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 55.06 శాతంలో ఉన్నారు. ఇతని రికార్డును శ్రేయస్ అయ్యర్ అధిగమించాడు. టోర్నీలో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన జాబితాలో ధోనీ 58.84 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సచిన్ 58.82 శాతంతో ఉన్నారు.
ఇదెలా ఉండగా..ప్రస్తుతం ఇండియన్ ప్రీమియల్ లీగ్ 18వ సీజన్ జరుగుతోంది. మొత్తం 10 జట్లు ఇందులో ఆడుతున్నాయి. అయితే ఇప్పటికి అన్ని జట్లు ఆడాయి. ఈ సీజన్లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతుంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ వరుస రెండు మ్యాచ్లు గెలిచింది. మొదటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఈజీగా కోల్కతా జట్టును ఓడించింది. ఆ తర్వాత మార్చి 28వ తేదీన చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఆర్సీబీ సీఎస్కేపై గెలిచింది. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత బెంగళూరు జట్టు సొంత గడ్డపై చెన్నైని ఓడించింది. వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్లో ఉంది.
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
-
Anushka Sharma: ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ ధరించిన కాస్ట్లీ ప్రొడక్ట్స్
-
IPL 2025: ఆర్సీబీ విజయానికి కలిసొచ్చిన ఆపరేషన్ సింధూర్
-
Virat Kohli Sensational Comments Rohit: రోహిత్పై కోహ్లీ సంచలన కామెంట్స్.. ఇంపాక్ట్ చూపించడం లేదంటూ..?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!