Anchor Swetha : తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. గుండెలు పిండేస్తున్న ఆఖరి పోస్ట్

Anchor Swetha : తెలుగు న్యూస్ మీడియాలో దాదాపు 18 ఏళ్లుగా న్యూస్ యాంకర్గా, జర్నలిస్ట్గా ఎంతో మందికి సుపరిచితురాలు అయిన ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్కి గురి చేసింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనతో మీడియా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ప్రస్తుతం టీ న్యూస్ ఛానెల్లో టీవీ యాంకర్గా పని చేస్తున్న స్వేచ్ఛ, శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. జవహర్నగర్లోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, ఆమె మృతదేహాన్ని పరిశీలించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రాంనగర్లో నివాసం ఉంటున్నారు.
స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే ఆమె స్నేహితులు, సన్నిహితులు, తోటి జర్నలిస్టులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ గతంలో టీవీ9లో కూడా పనిచేశారు. యాంకర్గానే కాకుండా, ఆమెకు రచయిత్రిగా కూడా మంచి గుర్తింపు ఉంది. ఆమె మనసులోని భావాలను, లోతైన ఆలోచనలను కవితల రూపంలో వ్యక్తపరిచేవారు.
Read Also:Credit Card : క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్ కి ఇస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త
ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం కొన్ని గంటల ముందు, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలకు బుద్ధుడి కోట్ను జతచేస్తూ, “మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అని రాసుకొచ్చారు. ఈ చివరి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆమె అభిమానులను, నెటిజన్లను ఎంతగానో కంటతడి పెట్టిస్తోంది. ఆమె ఇటీవల ఓ మ్యాగజైన్లో రాసిన కవిత కూడా అందరినీ కదిలిస్తోంది. ఆ కవితలో ఆమె ఇలా రాశారు:
“ఏదో బరువు మోస్తుంది.
అలసిపోతుంది.
అలిగిపోతుంది.
పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది.
కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది.
అందుకే ఊపిరున్నంతసేపు ఉండకుండా పోకు
ఉండకూడని చోటికి అసలే పోకు.”
Read Also:The Family Man : ఫ్యామిలీ మ్యాన్ 3 టీజర్ వచ్చేసింది.. మాస్టర్ పీస్ అంటున్న మనోజ్ ఫ్యాన్స్
ఈ కవితలోని ‘బరువు మోస్తుంది’, ‘అలసిపోతుంది’, ‘పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది’ వంటి మాటలు ఆమె పడిన మానసిక వేదనను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆమె తన మనసులోని సంఘర్షణను చివరి క్షణంలో కూడా కవిత రూపంలో వ్యక్తపరచడం అందరినీ మరింత కలచివేస్తోంది. స్వేచ్ఛ మరణం, మీడియా రంగంలో పనిచేసే వారు ఎదుర్కొనే ఒత్తిడిని, మానసిక ఆరోగ్య సమస్యల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తుంది. నిరంతరం వార్తలతో, డెడ్లైన్లతో, ప్రజా జీవితంలో ఉండే ఒత్తిళ్లతో కూడిన ఈ వృత్తిలో మానసిక ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.