IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో భద్రతా దృష్ట్యా ఐపీఎల్ సీజన్ 2025ను వాయిదా వేశారు. ఇటీవల ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఐపీఎల్ను ఎప్పుడు ప్రారంభిస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బీసీసీఐ ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ తెలిపింది. వాయిదా వేసిన ఐపీఎల్ను మే 17న తిరిగి మళ్లీ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

IPL new schedule: భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో భద్రతా దృష్ట్యా ఐపీఎల్ సీజన్ 2025ను వాయిదా వేశారు. ఇటీవల ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఐపీఎల్ను ఎప్పుడు ప్రారంభిస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బీసీసీఐ ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ తెలిపింది. వాయిదా వేసిన ఐపీఎల్ను మే 17న తిరిగి మళ్లీ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా బీసీసీఐ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025లో ఇంకా 17 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి మే 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. మొత్తం ఆరు స్టేడియంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. బెంగళూరు, జైపుర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికల్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే మే 17వ తేదీన ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. అయితే మే 29 క్వాలిఫయర్ 1 మ్యాచ్ నిర్వహించునుండగా.. 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని అయితే బీసీసీఐ వెల్లడించలేదు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ ఈ సీజన్లో టాప్లో గుజరాత్ టైటాన్స్ ఉండగా.. సెకండ్ ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. గుజరాత్ 11 మ్యాచ్లు ఆడిన 8 గెలిచి మూడు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 11 మ్యాచ్లు ఆడి 8 గెలవగా మూడు ఓడిపోయింది. అయితే రన్రేట్ గుజరాత్కు ఎక్కువగా ఉండటంతో మొదటి ప్లేస్లో ఉంది. ఇందులో మొత్తం 12 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ ఆడి 7 మాత్రమే గెలిచింది. మిగిలిన మూడు ఓడిపోయింది.
Read Also: గులాబ్జామ్ విత్ ఐస్క్రీమ్ తింటున్నారా.. ఇది మీకోసమే
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్లు మృతి చెందారు. సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో గడుపుదామని వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ పాక్ భారత్పైకి డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో బీసీసీఐ ఐపీఎల్ 2025ను మధ్యలోనే ఆపేసింది. నిజానికి ధర్మశాలలో మ్యాచ్ జరగుతుండగా ఆపేసింది. పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉండటంతో భద్రతా దృష్ట్యా బీసీసీఐ వెంటనే సీజన్ను వాయిదా వేసింది.
-
IPL 2025: పంజాబ్ జట్టు సరికొత్త రికార్డు
-
IPL 2025: ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే.. డైరెక్ట్ ప్లేఆఫ్స్
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!
-
IPL 2025: ప్లేఆఫ్ రేస్కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే?
-
Gautam Gambhir: విరాట్, రోహిత్ ఔట్.. ఇక గౌతమ్ గంభీర్ హవానే!
-
Riyan Parag: వరుసగా ఆరు సిక్స్లు.. ఐపీఎల్ చరిత్రలోనే రియాగ్ పరాగ్ రికార్డు