RBI : కేంద్రానికి భారీ బొనాంజా.. RBI నుండి రూ.3లక్షల కోట్ల చెక్కు!

RBI : కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి త్వరలో 3 లక్షల కోట్ల రూపాయల చెక్కు అందే అవకాశం ఉంది. ఆర్బీఐ తన బోర్డు సమావేశంలో భారత ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ను ఇవ్వడానికి ఆమోదం తెలుపవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే భారత ప్రభుత్వానికి మూలధన వ్యయం (క్యాపెక్స్) విషయంలో చాలా వెసులుబాటు లభిస్తుంది. అది కూడా భారత ప్రభుత్వం 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితం చేసిన సమయంలో, పన్ను రాబడి తగ్గుతుందని అంచనా వేస్తున్న సమయంలో ఇది ఊరటనిస్తుంది. ఈ డివిడెండ్ భారత ప్రభుత్వానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. అలాగే ఆర్బీఐ, మార్కెట్ నుంచి డివిడెండ్కు సంబంధించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో కూడా చూద్దాం.
Read Also:Viral Video : టాలెంట్ అంటే ఇది.. ఇంజినీర్లకు కూడా సాధ్యం కానిది ఈ రిక్షా వాలా చేసి చూపించాడు!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మే 23న సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేంద్ర బ్యాంకు బ్యాలెన్స్ షీట్ వార్షిక సమీక్ష జరుగుతుంది. అలాగే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మిగులు నిధులను (surplus fund) ప్రభుత్వానికి బదిలీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిధులు 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. ఇది గత సంవత్సరం ఇచ్చిన డివిడెండ్ కంటే దాదాపు 50 శాతం ఎక్కువ. IDFC ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గౌరా సేన్ గుప్తా మాట్లాడుతూ.. RBI డివిడెండ్ 2.6 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తాము అంచనా వేస్తున్నామని తెలిపారు.
Read Also:Happy life: ఇలాంటి ఇంట్లో హ్యాపీ లైఫ్.. చల్లని గాలి.. ప్రశాంతత
డివిడెండ్ ఎలా నిర్ణయిస్తారు?
ఆర్బీఐ బోర్డు మే 15న ఆర్థిక మూలధన ఫ్రేమ్వర్క్ (Economic Capital Framework – ECF) సమీక్షించేందుకు సమావేశమైంది. మిగులు లేదా డివిడెండ్ను నిర్ణయించడంలో ఎకానమిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ ఒక ముఖ్యమైన అంశం. ఆర్బీఐ దీనిని 2019లో స్వీకరించింది. సంబంధిత కమిటీ కాంటింజెంట్ రిస్క్ బఫర్ (Contingent Risk Buffer – CRB) కింద రిస్క్ ప్రొవిజన్ను ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో 6.5-5.5 శాతం పరిధిలో ఉంచాలని సిఫార్సు చేసింది. సమీక్షా కాలంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా కేంద్ర బ్యాంకు నిర్వహించే CRB స్థాయిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఇది నేరుగా ఒక సంవత్సరం కాలంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధం కలిగి ఉంటుంది.
-
Mahindra Bolero : టయోటా ఫార్చ్యూనర్కు పోటీగా మహీంద్రా బొలెరో బోల్డ్.. ప్రత్యేకతలు ఇవే!
-
Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
Obesity in India : పిల్లలను కూడా వదలని ఊబకాయం.. వచ్చే 25 ఏళ్లలో అందరికీ పొట్టలుంటాయట
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్