Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
Asia Cup 2025 మిగతా జట్లకు అన్యాయంగా మారుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు అత్యధిక ప్రేక్షకాదరణ ఉంటుంది.

Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ ఇచ్చింది. ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదని, అనేక దేశాల టోర్నమెంట్ లో భాగంగా జరిగే మ్యాచ్ మాత్రమేనని ఏసీసీ సభ్యులు తెలిపారు. ఇండియా గేమ్ నుంచి తప్పుకుంటే, పాకిస్తాన్ కు నేరుగా వాక్ ఓవర్ లభిస్తుందన్నారు. అది మిగతా జట్లకు అన్యాయంగా మారుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు అత్యధిక ప్రేక్షకాదరణ ఉంటుంది.
దీనివల్ల మిగతా 24 ఏసీసీ సభ్య దేశాలకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. సోని నెట్ వర్క్ ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులను 8 ఏళ్లకు 170 మిలియన్ తో పొందింది. అందులో ప్రధాన భాగం భారత్ పాకిస్థాన్ మ్యాచ్ నుంచే వస్తుంది. కాబట్టి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదన్నారు. ఇండియా వేదికగా ఉన్నప్పటికీ, ఆసియా కప్ 2025 యూఏఈలో జరగనుంది. టోన్నమెంట్ కు సంబంధించిన ప్రభుత్వ అనుమతి ముందే లభించిందని సమాచారం. క్రీడల మంత్రి మన్ సుఖ్ మాండవియా ఇటివలే ప్రకటించినట్లు, ఆయా దేశాల ఈవెంట్ లలో పాకిస్థాన తో భారత్ ఆడతుందనే విషయం ఇప్పటికే స్పష్టమైందని తెలిపారు.
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?