Turkey: మాల్దీవులకు అర్థమైంది.. తుర్కియోకు అర్థమవుతోంది..భారత్ తో గెలుక్కుంటే అంతే సంగతులు!
Turkey భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్.. కాకలు తీరిన అమెరికా కూడా మన దగ్గర తన ఉత్పత్తులను అమ్ముకొని బతకాల్సిందే. అక్కడిదాకా ఎందుకు అంతటి చైనా కూడా మన ముందు సైలెంట్ అవ్వాల్సిందే.

Turkey: ఆ మధ్య గాల్వన్ లోయ ఘటన జరిగినప్పుడు భారత్ చైనా మీద ట్రేడ్ వార్ కొనసాగించింది. చైనా దేశానికి చెందిన సోషల్ మీడియా యాప్స్ పై భారీ దెబ్బ వేసింది. దీంతో చైనా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాదు మధ్య మార్గాల ద్వారా మన దేశ పాలకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక అమెరికాపై కూడా ప్రతిగా సుంకాలు విధించడానికి మనం రెడీ అవుతున్నామంటే.. ఆర్థికంగా, రాజకీయంగా మన ప్రస్థానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి మనపై అవాకులు చవాకులు పేలితే.. అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు కొన్ని దేశాలకు తెలిసి వస్తోంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల ముందు భారత్ స్థాయి ఏమిటో నిరూపిస్తోంది…
సరిగ్గా ఏడాది క్రితం..
సరిగ్గా ఏడాది క్రితం మనపై మాల్దీవులు తీవ్ర అక్కసు ప్రదర్శించింది. మన దేశంలో ఉన్న సముద్ర దీవుల ప్రాంతాన్ని పర్యాటకంగా ఎంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచిస్తే.. మాల్దీవుల ప్రభుత్వం దానిని వ్యతిరేకంగా తీసుకుంది. భారతదేశంపై తీవ్రమైన విమర్శలు చేసింది. అంతేకాదు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసింది. చివరికి సారి చెప్పాల్సి వచ్చింది. అయితే భారత్ మీద చేసిన విమర్శల నేపథ్యంలో మన దేశానికి చెందిన పర్యాటకులు మాల్దీవులు వెళ్లడం మానేశారు. మాల్దీవులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే చేశారు. దీంతో టూరిజం నుంచి ఆదాయం లేకుండా పోవడంతో మాల్దీవులు దివాలా తీసింది. చైనాను నమ్ముకుంటే.. చైనా కూడా ఆదేశాన్ని నట్టేట ముంచింది. దీంతో ఇప్పుడు మాల్దీవుల ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షేభంలో కూరుకుపోయింది. ఇప్పటికిప్పుడు భారతదేశాన్ని ప్రసన్నం చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చైనా తో అంట కాగినందుకు భారత్ మాల్దీవులకు చేయూత అందించే పరిస్థితి లేకుండా పోయింది.
తుర్కియో కూడా..
ఒక అనుభవం నుంచి పాఠం నేర్చుకోవాలి. దానిని అమలులో పెట్టి.. బాగుపడే ప్రణాళికలు రూపొందించుకోవాలి.. కానీ ఈ ఇంగితం తుర్కియో దేశానికి లేకుండా పోయింది. భారత్ ఎంత శక్తివంతమైనదో తెలిసినప్పటికీ కూడా.. అనవసరంగా ఉగ్రవాద దేశానికి సహాయం చేసింది. దీంతో అది మన దేశ పరిపాలకులకు ఒళ్ళు మండేలా చేసింది. ఫలితంగా తుర్కియో పై భారత్ ట్రేడ్ వార్ మొదలుపెట్టింది. ఆ దేశం నుంచి వస్తున్న ఆపిల్స్ ను దిగుమతి చేసుకోవద్దని మన దేశానికి చెందిన వ్యాపారులు నిర్ణయించారు. దీంతో 1500 కోట్ల విలువైన ఆపిల్స్ ఆగిపోయాయి. అంతేకాదు తుర్కియో లో పర్యటించకూడదని మనదేశ పర్యాటకులు నిర్ణయించుకున్నారు. అటు పర్యాటకపరంగా.. ఇటు వ్యాపారపరంగా తుర్కియో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటోంది. మన శత్రువుకు సపోర్ట్ చేసినందుకు.. మన దేశ పరిపాలకులు.. ప్రజలు తుర్కియో పై వాణిజ్య దండయాత్ర చేస్తున్నారు. దీంతో తుర్కియో పాలకులు తలలు పట్టుకున్నారు. అనవసరంగా ఉగ్రవాద దేశానికి సహాయం చేసి నష్టపోతున్నామని గుండెలు బాదుకుంటున్నారు.
-
Former Pakistan captain Shahid Afridi: పాక్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది మృతి.. ఇందులో నిజమెంత?
-
ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
-
Honda Electric Bike: హోండా ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోతారు
-
Supreme Court : భారత్ ధర్మశాల కాదు.. ఇప్పటికే 140 కోట్ల మందితో పోరాడుతున్నాం : సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
Mahindra Bolero : టయోటా ఫార్చ్యూనర్కు పోటీగా మహీంద్రా బొలెరో బోల్డ్.. ప్రత్యేకతలు ఇవే!
-
Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!