Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Fish: చేపలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందులోనూ ఫ్రెష్ చేపలు అయితే లొట్టలేసుకుని మరి తినేస్తారు. ఎందుకంటే ఇవి తినడానికి టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మంచివి కూడా. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే చేపలో ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని చేపలు అయితే వేలు కాదు.. లక్షలు కూడా పలుకుతుంటాయి. అయితే తాజాగా ఓ చేప ధర తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కేజీ చేప ధర కొనే బదులు బంగారం కొనేయవచ్చని అంటున్నారు. అసలు ఆ చేప ఏంటి? ఎందుకు ఆ చేపకు అంత డిమాండ్? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
తెలియా భోలా చేపకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ చేప ఎక్కువగా సముద్రంలో కనిపిస్తుంది. బంగారు రంగులో ఉండే ఈ చేప సముద్రపు లోపల ఉంటుంది. ఇది దొరకడం కూడా చాలా కష్టం. అయితే చేప ధర కేజీ రూ.30,000–35,000 వరకు ఉంటుంది. 2022లో 55 కిలోల చేప రూ.13 లక్షలకు అమ్ముడైంది. కానీ ఇప్పుడు ఆ చేప కేజీ రూ.30 వేలకు పైగా అమ్ముడవుతోంది. అయితే తాజాగా ఈ చేప ఒడిశాలోని బాలాసోర్కు చెందిన ఒక మత్స్యకారుడికి లభించింది. ఒకటి కాదు ఏకంగా 29 తెలియా భోలా చేపలు వలలో పడ్డాయి. ఒక్కో చేప దాదాపుగా 20 కిలోలకు పైనే బరువు ఉంటుందట. అయితే ఈ చేపలో అంతగా ఏముంది ఇంత ప్రైజ్ అని అనుకుంటున్నారు. అయితే ఈ చేప కడుపులో ఉండే ఒక పార్ట్ వల్ల ఖరీదు ఎక్కువగా ఉంది.
ఏడాదికి తక్కువగా లభించే ఈ చేపల కడుపులో ‘మా’ అనేది ఉంటుంది. ఇందులో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కువగా మందులు తయారీలో వాడుతారు. అందుకే ఈ చేప ఖరీదు ఎక్కువ. వీటితో పాటు క్యాప్సూల్ కవర్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. దేశంలో కంటే విదేశీ మార్కెట్లలో భారీగా ఈ చేపకు ఉంది. అయితే ఈ చేపలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ చేప వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉండటం వల్ల దీని ఖరీదు మార్కెట్లో కాస్త ఎక్కువగా ఉంది. అయితే ఈ చేపలు ఏడాదిలో ఒకటి లేదా రెండు మాత్రమే వలకి చిక్కుతాయట. సముద్రంలో చాలా లోతులో ఈ చేపలు ఎక్కువగా ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే ఈ చేపలు లభ్యమవుతాయి.
Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్