IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!

IPL 2025 : భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే శనివారం అంటే మే 17 నుంచి ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమవుతోంది. మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ప్లేఆఫ్కు చేరుకోవడానికి టాప్ 7 జట్ల ప్రతి మ్యాచ్ చావో రేవో లాంటిదే. దీని కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇంతలో బీసీసీఐకి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. కోల్కతా క్రికెట్ అభిమానులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న ఒక నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు శుక్రవారం (మే 16) ఈడెన్ గార్డెన్స్ వెలుపల నిరసన ప్రదర్శన చేశారు.
అభిమానులు ఎందుకు నిరసన తెలిపారు?
ఐపీఎల్ 2025 ఫైనల్ మొదట మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ లీగ్ను ఒక వారం పాటు నిలిపివేశారు. ఇప్పుడు శనివారం (మే 17) నుంచి ఇది మళ్లీ ప్రారంభమవుతోంది. కానీ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కోల్కతాలో జరగదని భావిస్తున్నారు. దీనిపై కోల్కతా క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు మే 16న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వెలుపల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు.ఈ సీజన్ ఫైనల్ మొదట ఎక్కడైతే నిర్ణయించారో అక్కడే జరగాలి. నిరసన చేస్తున్న ప్రజలు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.ఈ నిరసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Fruit Peel Uses : తొక్కే కదా అని పారేస్తున్నారా.. పండ్ల తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
View this post on Instagram
మే 25న జరగాల్సిన ఐపీఎల్ 2025 ఫైనల్ ఇప్పుడు జూన్ 3న జరుగుతుంది. అంతేకాకుండా, టైటిల్ పోరు ఇప్పుడు కోల్కతాకు బదులుగా అహ్మదాబాద్లో జరగవచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఈ సీజన్ క్వాలిఫయర్ 2, ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వడానికి సెలక్ట్ చేశారు. ఈ రెండు మ్యాచ్లు జూన్ 1, 3 తేదీల్లో జరుగుతాయి.
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా ఈ లీగ్ను ఒక వారం పాటు నిలిపివేశారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత మే 12న బీసీసీఐ ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ను రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. అయితే, ఫైనల్ ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
Read Also:Kubera Movie : కుబేరా మేనియా.. విడుదల కాకముందే రికార్డులు సృష్టిస్తున్న రష్మిక-ధనుష్ మూవీ!
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు