Gold: కుప్పలు తెప్పలుగా పుడుతున్న బంగారం.. సైంటిస్టులు ఏమన్నారంటే?

Gold: బంగారం చాలా విలువైనది. రోజురోజుకీ దీని ధర పెరుగుతూనే ఉంది. బంగారాన్ని భవిష్యత్తుగా భావించి చాలా మంది కొని సేవ్ చేస్తున్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆస్తిగా దీన్ని భావిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే ఎక్కువ బంగారం మన దేశంలోనే ఉంది. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగా ఉన్నా కూడా.. ఇంకా ఎక్కువగా పుట్టుకొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమికి అత్యంత లోపలి పొర అయిన కోర్లో బంగారం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే భూమిలోని కోర్ పొరల నుంచి బంగారం అనే కాకుండా ఇతర విలువైన లోహాలు కూడా బయటకు లీక్ అవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా హవాయిలోని అగ్ని పర్వత శిలలపై జరిపిన పరిశోధనల్లో తేలింది.
అగ్నిపర్వతాలు పేలితే భూమి నుంచి బయటకు లావా వస్తుంది. ఆ లావాతో పాటు కొన్నిసార్లు ఆ ప్రాంతాల్లోని లోహాలు కూడా బయటికి వస్తాయి. అయితే భూమి లోపల చాలా పెద్ద మొత్తంలో బంగారం ఉంది. కానీ ప్రస్తుతం బయటకు వస్తున్న బంగారం చాలా తక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమిలోని 99 శాతం బంగారం మెటాలిక్ కోర్ ప్రాంతంలోనే ఉందని, ఒకవేళ ఆ బంగారం మొత్తం బయటికి వస్తే, భూమి ఉపరితలాన్ని దాదాపు 50 సెంటీమీటర్ల మందంతో కప్పేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ లీకేజీ ప్రక్రియ అంతా భూమి ఉపరితలానికి దాదాపు 3 వేల కిలోమీటర్ల లోపల జరుగుతోంది. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైన భూమి కోర్ ప్రాంతం నుంచే 99.999 శాతం బంగారం, ఇతర విలువైన లోహాలు తయారవుతూ ఉంటాయని చెబుతున్నారు.
హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం, రుథేనియం వంటి లోహాలు అగ్నిపర్వతాల ద్వారా బయటికి రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వత శిలల్లో ఇటీవల రుథేనియం నిల్వలను గుర్తించారు. ఈ శిలల మూలం కోర్-మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తేలింది. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలు మాంటెల్ పొరల్లోని లావా వల్ల ఏర్పడతాయి. అయితే ఈ శిలల్లో బంగారం, ఇతర విలువైన లోహాలు ఉండటాన్ని చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. కోర్లో ఉండే బంగారం మాంటెల్కు లీక్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అగ్నిపర్వత బసాల్ట్ శిలల్లో చేరుతుంది. ఇది భూమి పైభాగానికి వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గోట్టింగెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనా బృందం ఈ విషయాన్ని తెలిపింది. హవాయి సముద్ర ద్వీపాలు కూడా అగ్నిపర్వత శిలల వల్లే ఏర్పడ్డాయి. లావా పైకి వచ్చి గట్టిపడుతుంది. చివరకు ద్వీపాలుగా మారుతుందని నిపుణులు అంటున్నారు. భూమి లోపలి నుంచి బంగారం పైకి ఉబికి వస్తుందని గోట్టింగెన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెలుగులోకి రావడం నిజంగా ఆసక్తికరంగా మారింది. ఇది భూమి లోపలి పొరల గురించి వాటిలోని ఖనిజాల కదలికల గురించి మరింత లోతైన అధ్యయనాలకు దారితీస్తుంది.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Gold Price : ట్రంప్ దెబ్బకు పెరిగిన బంగారం.. మళ్లీ రూ.లక్షకు చేరువలో గోల్డ్!
-
Point Nemo : భూమికి దూరంగా.. అంతరిక్షానికి దగ్గరగా.. పాయింట్ నెమో ప్రత్యేకత ఇదే
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్