Jio : కస్టమర్లకు షాక్.. నిలిచిపోయిన జియో సేవలు.. మీకు ప్రాబ్లమ్ వచ్చిందా ?

Jio : దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటి అయిన రిలయన్స్ జియో (Reliance Jio) సేవలు నేడు (జూన్ 16, 2025) అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని వినియోగదారులు మొబైల్ నెట్వర్క్, బ్రాడ్బ్యాండ్ సర్వీసు రెండింటిలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నెట్వర్క్ స్తంభన కారణంగా ఇంటర్నెట్ స్పీడు బాగా తగ్గిపోయింది. చాలా మంది ఫోన్లు నెట్వర్క్ పరిధిలో లేవు. కాల్స్ కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వడం లేదు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, కేరళ రాష్ట్రంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. కేరళలోని వేలాది జియో వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో నెట్వర్క్ లేదని, జియోఫైబర్ (JioFiber) ఇంటర్నెట్ పనిచేయడం లేదని, చాలా మంది ఫోన్లు నెట్వర్క్కు రిజిస్టర్ అవ్వడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
డౌన్డిటెక్టర్ నివేదిక ప్రకారం.. 56 శాతం మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 22 శాతం మంది వినియోగదారులకు మొబైల్ నెట్వర్క్ సమస్యలు వస్తున్నాయి. అదే 22 శాతం మంది జియోఫైబర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డౌన్డిటెక్టర్ అనేది ప్రజల ఫిర్యాదుల ఆధారంగా ఏ సేవలో ఎంత పెద్ద లోపం వచ్చిందో తెలియజేసే వెబ్సైట్. అంటే, చాలా మంది వినియోగదారులకు ఇంటర్నెట్, కాలింగ్ రెండింటిలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి.
Read Also:Citroen C3 : స్పోర్టీ లుక్, సరికొత్త కలర్ తో సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్ లాంచ్
ఎక్స్ ప్లాట్ఫారమ్లో ప్రజలు జియో సర్వీస్ క్వాలిటీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పోస్ట్లలో, జియో నెట్వర్క్ కేరళలో అకస్మాత్తుగా డౌన్ అయిందని రాశారు. కాల్స్ కనెక్ట్ కావడం లేదు, నెట్వర్క్ రిజిస్టర్ కావడం లేదు. ఇది ఏదైనా సైబర్ దాడినా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
మరొక నెటిజన్ “జియో సిమ్, కాల్, ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ అన్నీ నిలిచిపోయాయి. ఎటువంటి సమాధానం లేదు. @JioCare ఆన్సర్ ఇవ్వండి!” అని రాశారు. ఈ విధంగా అనేక ఫిర్యాదులు వెలువడుతున్నాయి. సర్వీసులు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు రిలయన్స్ జియో వైపు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ స్తంభన ఏదైనా నెట్వర్క్ వైఫల్యం లేదా సిస్టమ్ అప్గ్రేడేషన్ (System Upgradation) కారణంగా జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.
వినియోగదారులు ఏమి చేయాలి?
మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్లో కూడా సమస్యలు ఎదురవుతున్నట్లయితే ఈ పద్ధతులను ప్రయత్నించవచ్చు. జియో నెట్వర్క్ మళ్లీ సరిగ్గా మాగ్జిమమ్ పనిచేస్తుంది.ఫోన్ను రీస్టార్ట్ చేయండి. ఎయిర్ప్లేన్ మోడ్ను ఆన్ చేసి ఆఫ్ చేసి చూడండి. జియోఫైబర్ ఉపయోగిస్తున్నట్లయితే రౌటర్ను రీస్టార్ట్ చేయండి. ఇప్పటికీ నెట్వర్క్ రాకపోతే, జియోకేర్కు సోషల్ మీడియా లేదా యాప్ ద్వారా ఫిర్యాదు పంపాలి.
Read Also:Prabhas : ఆ సినిమా తర్వాత ఏకంగా 6 వేల పెళ్లి ప్రపోజల్స్.. 45ఏళ్లలోనూ ఇంకా ఒంటరిగానే స్టార్ హీరో