Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. కోర్డు కీలక ఆదేశాలు
Konda Surekha డ్రగ్స్ తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాపంల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది.

Konda Surekha: కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాపంల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది.
ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై ఈ నెల 21వ తేదీ లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసు జారీ చేయాలని నాంపల్లి కోర్డు స్పష్టం చేసింది. కేటీఆర్ పై కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్లు నాంపల్లి కోర్డు గుర్తించింది.
Related News
-
KTR Fires On Congress: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
-
Bandi Sanjay: సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ
-
KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
KTR: రేవంత్ దూకే గోడలు కేటీఆర్ కు ఎలా తెలుసు.. పోలీసులు లీకులు ఇస్తున్నారా?