NEET PG : నీట్ పీజీ ఒకే షిఫ్ట్.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశం

NEET PG : సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తాజా ఆదేశం దేశంలో ఒక కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. నీట్ పీజీ(NEET PG) పరీక్ష ఒకే షిఫ్ట్లో నిర్వహించగలిగినప్పుడు ఇతర పరీక్షలకు కూడా ఈ సౌకర్యం ఎందుకు కల్పించలేకపోతున్నారని చాలా మంది మదిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీం కోర్టు తన తీర్పులో పరీక్షలను నిర్వహించే సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) కు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 15న జరగనున్న నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని కోరింది. దీని కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు బోర్డు చేయాలని స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల పరీక్ష పారదర్శకత కాపాడినట్లు అవుతుందని ఎవరికీ అభ్యంతరాలు ఉండే అవకాశం ఉండదని కోర్టు పేర్కొంది. రెండు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహణ ప్రకటన తర్వాత కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ వార్త బయటకు రాగానే.. “నీట్ పీజీ ఒకే షిఫ్ట్లో నిర్వహించగలిగినప్పుడు, నీట్ యూజీ (NEET UG), జేఈఈ మెయిన్స్ (JEE Mains), జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced), సీయూఈటీ (CUET) తో పాటు ఇతర పరీక్షలు ఎందుకు ఒకే షిఫ్ట్లో నిర్వహించలేరు?” అనే చర్చ మొదలైంది. ఈ పరీక్షలన్నింటిలో అనేక సబ్జెక్టులు ఉంటాయి. ఉదాహరణకు, సీయూఈటీ (CUET) ని తీసుకుంటే.. ఇది యూజీసీ (UGC) నిర్వహించే పరీక్ష. ఇది ఏ విభాగంలోనైనా ప్రవేశానికి అర్హతను నిర్ణయిస్తుంది. ఇదే పరీక్ష రాసి ఒక విద్యార్థి బీఏలో చేరవచ్చు, లేదా బీకాం, బీఎస్సీలో కూడా ప్రవేశం పొందవచ్చు. బీఏ, బీఎస్సీలలో చాలా సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి సబ్జెక్టులను సెలక్ట్ చేసుకుంటారు. ఈ కారణంగానే ఈ పరీక్ష చాలా రోజులు జరుగుతుంది. ఇప్పుడు దీనిని ఒకే షిఫ్ట్లో నిర్వహించాలంటే కేవలం సాధారణ జ్ఞానం, సాధారణ గణితం వంటి పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల సబ్జెక్టు లోతుగా తెలుసుకోవడం కష్టం అవుతుంది.
Read Also:Loss of Bladder Control: తెలియకుండానే మూత్రం పడిపోతుందా.. అయితే అది ఈ వ్యాధి లక్షణం కావొచ్చు
నీట్ యూజీలో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల ప్రశ్నలు విద్యార్థులకు వస్తాయి. జేఈఈ మెయిన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రశ్నల స్థాయి కొంచెం కఠినంగా ఉంటుంది. అన్ని పరీక్షలను ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తే, ఫలితాలు చాలా సాధారణంగా రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, సాధారణంగా మన దేశంలో మూడు గంటలలో పరీక్షలు నిర్వహించే సంప్రదాయం ఉంది. అయితే, నీట్ పీజీ పరీక్ష నేటికీ 3.30 గంటల పాటు జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే షిఫ్ట్లో పరీక్షను ఖచ్చితంగా నిర్వహించవచ్చు.
ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని అన్ని పరీక్షలను ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తే అది కేవలం నామమాత్రపు పరీక్షగా మాత్రమే మిగిలిపోతుందని చాలా మంది అంటున్నారు. అనేక సబ్జెక్టుల ప్రశ్నలు ఒకే ప్రశ్నపత్రంలో అడిగినప్పుడు సహజంగానే క్వాలిటీతో రాజీ పడాల్సి వస్తుంది. ఇది దేశ యువత ప్రయోజనాలకు మంచిది కాదని అంటున్నారు. నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించడం అనేది మిగతా అన్ని పరీక్షల కంటే భిన్నమైనదని పలు యూనివర్శిటీల ప్రొఫెసర్లు అంటున్నారు.
Read Also:Pregnant Women : గర్భిణులు పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వాడొచ్చా? డాక్టర్లు ఏమంటున్నారంటే ?