Good News: డీఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. ఫ్రీ మాక్ టెస్ట్లు
ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఇందులో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టనుంది. అయితే వీటికి పరీక్షలు వచ్చే నెల జూన్ 6వ తేదీ నుంచి జులై 6 వరకు జరగనున్నాయి.

Good News: ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఇందులో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టనుంది. అయితే వీటికి పరీక్షలు వచ్చే నెల జూన్ 6వ తేదీ నుంచి జులై 6 వరకు జరగనున్నాయి. ఈ డీఎస్సీలో మొత్తం 16347 పోస్టులు ఉన్నాయి. వీటికి మొత్తం 5.67 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఈ పరీక్షలు సరిగ్గా రాయాలంటే తప్పకుండా మాక్ టెస్ట్లు రాయాలి. అప్పుడే పరీక్షల్లో బాగా రాణిస్తారు. డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ల కోసం ఏపీ పాఠశాల విద్యా శాఖ ఫ్రీ మాక్ టెస్ట్లు నిర్వహిస్తోంది. https://apdsc.apcfss.in/లో వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇందులోకి వెళ్లి మీరు మీకు నచ్చిన కేటగిరీలో పరీక్షలు రాయవచ్చు. ఎజీటీ, పీజీటీ ప్రిన్సిపాల్, పీజీటీ సోషల్, టీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ మ్యాథ్స్, పీటీటీ ఇంగ్లీష్కి అప్లై చేసిన అభ్యర్థులు మాక్ టెస్ట్లు రాయవచ్చు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్లోకి మీరు ప్రిపేర్ అయ్యే పరీక్షలకు మాక్ టెస్ట్లకు ప్రాక్టీస్ అవ్వచ్చు.
Read Also: గాల్లో విమానం ఉండగానే వడగళ్ల వర్షం.. విమానం ఎలా మారిందో చూశారా?
ఏపీ డీఎస్సీ మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఉద్యోగాలు ఇవ్వనుంది. అయితే ఈ పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉండగా, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. వీటితో పాటు బధిర, అంధ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు.
Read Also: విమానాశ్రయాలు లేని పర్యాటక దేశాలు ఇవే
ఈ పోస్టులకు పేపర్-1గా ఆంగ్ల భాష నైపుణ్యం ఉంటుంది. అయితే 881 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉండగా.. 15 జువెనైల్ పాఠశాలల్లో, 31 పోస్టులు ఉన్నాయి. అయితే వీటిలో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 60 మార్కులు అర్హత సాధించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయితే 50 మార్కులు వస్తే చాలు. ఇక ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు అయితే 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వీటీలో టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ద్వారా వెయిటేజీ 20 శాతం ఉంటుంది. ఎక్కువగా కర్నూలు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 1,817 ఉన్నాయి. ఇక తక్కువగా ప్రకాశం జిల్లాలో 106 పోస్టులు ఉన్నాయి.
-
Admissions at IIIT Basara: ఐఐఐటీ బాసరలో ప్రవేశాలు.. విద్యార్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే?
-
Joining ISRO: ఇస్రోలో చేరడం మీ కల అయితే.. ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి
-
Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
-
Mega family: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్లో అద్భుతమైన ఫీచర్లు
-
Good news: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. నిరుద్యోగులు రెడీ అవ్వండి