Admissions at IIIT Basara: ఐఐఐటీ బాసరలో ప్రవేశాలు.. విద్యార్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే?
Admissions at IIIT Basara: ఐఐఐటీ క్యాంపస్లో ప్రవేశాల కోసం కేవలం పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటారు. వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

Admissions at IIIT Basara: పదవ తరగతిలో మంచి మార్కులు వస్తే తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తుంది. అయితే బాసరలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు. ఐఐఐటీ క్యాంపస్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. టెన్త్ పాస్ కావడంతో పాటు మంచి మార్కులు వచ్చిన వారి నుంచి ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే వీటికి మే 31 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వీటికి అప్లై చేసుకోవడానికి జూన్ 21వ తేదీ చివరి తేదీ. అయితే జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రభుత్వం ప్రకటిస్తుంది. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంతకు ముందు పదవ తరగతికి గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఉండేవి. ఇప్పుడు మార్కులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్కుల ఆధారంగానే ఐఐఐటీలో ప్రవేశాలు కల్పించనున్నారు.
Also Read: YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?
ఐఐఐటీ క్యాంపస్లో ప్రవేశాల కోసం కేవలం పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటారు. వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు. అయితే ప్రభుత్వ కాలేజీలో చదివిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది బాసరలో 1500 సీట్లు మాత్రమే కాకుండా.. మహబూబ్నగర్ లోనూ ఐఐఐటీ క్యాంపస్ కూడా ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుంచే అక్కడ జాయిన్ చేసుకుంటారు. 180 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది. తాజాగా మార్కుల విధానం అమలు చేస్తుండటంతో.. ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. అంటే మొత్తం 24 అదనపు మార్కులు జోడిస్తారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఒకవేళ 2 విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్లో ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వారికి సీట్లు కేటాయిస్తారు. సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
-
Pawan Kalyan shocking look in OG: ఓజీ లో పవన్ కళ్యాణ్ షాకింగ్ లుక్.. లీక్డ్ వీడియో వైరల్
-
Allu Arjun Pushpa: రూ.1800 కోట్ల సినిమా.. పుష్పలో షెకావత్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఫహాద్ ఫాసిల్ కాదా !
-
Joining ISRO: ఇస్రోలో చేరడం మీ కల అయితే.. ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి
-
Good News: డీఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. ఫ్రీ మాక్ టెస్ట్లు
-
Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
-
Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్