Kamal Haasan : ‘థగ్ లైఫ్’కి ఇంకో దెబ్బ.. రూ.25 లక్షల జరిమానా, తల పట్టుకున్న కమల్ హాసన్!

Kamal Haasan : కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాకి కష్టాలు ఇంక అయిపోలేదు. సినిమా విడుదలకు ముందే మొదలైన ఇబ్బందులు, విడుదలైన వారాల తర్వాత కూడా వెంటాడుతూనే ఉన్నాయి. కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాలేదు. దీంతో సినిమా టీమ్కు దాదాపు రూ.30 కోట్ల నష్టం వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ‘థగ్ లైఫ్’ దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాపై ఏకంగా రూ.25 లక్షల జరిమానా పడింది!
‘థగ్ లైఫ్’ సినిమా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇదే కారణంతో సినిమాను ఓటీటీలో త్వరగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఓటీటీలో కూడా ఆలస్యం చేస్తే లక్షల్లో నష్టం వస్తుందేమోనని సినిమా టీమ్ భయపడింది. అందుకే, సినిమా విడుదలైన నాలుగే వారాలకే ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పుకున్నారు. కానీ, ఇదే ఇప్పుడు మల్టీప్లెక్స్ యజమానులకు కోపం తెప్పించింది!
Read Also:YouTube : యూట్యూబ్ రూల్స్లో భారీ మార్పులు.. లైవ్ స్ట్రిమింగ్ కు కొత్త నిబంధనలు
మల్టీప్లెక్స్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ‘థగ్ లైఫ్’ సినిమాను విడుదలైన ఎనిమిది వారాల ముందు ఓటీటీలో విడుదల చేయకూడదు. కానీ, నష్టాలను తగ్గించుకోవడం కోసం సినిమా నిర్మాతలు కమల్ హాసన్, మణిరత్నం కేవలం నాలుగే వారాలకు సినిమాను ఓటీటీకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.
సినిమాను ఓటీటీలో తొందరగా విడుదల చేయాలనే కారణంతో సినిమా టీమ్ మల్టీప్లెక్స్ చైన్లతో చేసుకున్న ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. అందుకే, నేషనల్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్ళు ‘థగ్ లైఫ్’ సినిమాపై రూ.25 లక్షల జరిమానా విధించారు. “ఒప్పందం ప్రకారం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయండి. లేదంటే రూ.25 లక్షల జరిమానా కట్టండి” అని సినిమా నిర్మాతలకు నోటీసులు పంపారు.
Read Also:Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ.130 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అవ్వడంతో సినిమాను ఆలస్యంగా విడుదల చేస్తే మొత్తం అమౌంట్లో కోత విధిస్తామని నెట్ఫ్లిక్స్ చెప్పిందట. అందుకే సినిమా టీమ్ నాలుగే వారాలకు ఓటీటీకి తీసుకురావడానికి సిద్ధమైంది. కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి నటించిన ఈ సినిమాను మణిరత్నం డైరెక్ట్ చేశారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది.