Bengaluru Stampede Tragedy: బెంగుళూరు తొక్కిసలాట మరణాల వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే !

Bengaluru Stampede Tragedy: ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించిన విజయం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహాన్ని పంచుకోవడానికి బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ కవాతు నిర్వహించారు. ఈ కవాతులో లక్షలాది మంది అభిమానులు పాల్గొనడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. జనాన్ని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 10 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషాదం తర్వాత, తొక్కిసలాటలో ప్రజలు తమ ప్రాణాలను ఎలా కోల్పోతారో, వారిని ఎలా కాపాడుకోవాలో నిపుణులు కొన్ని సూచనలు చేశారు.
తొక్కిసలాటలో మరణం వెనుక శాస్త్రీయ కారణాలు
ఒక చోట అధికమంది జనం గుమిగూడినప్పుడల్లా అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా ఇటువంటి సంఘటనలు విషాదకరంగా ముగుస్తాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. సాధారణంగా తొక్కిసలాటలో కింద పడిపోవడం వల్లే మరణం సంభవిస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, దాని వెనుక అనేక శాస్త్రీయ, భౌతిక కారణాలు ఉన్నాయి.
ఢిల్లీలోని RML హాస్పిటల్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ పులీన్ కుమార్ మాట్లాడుతూ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరంపై అధిక ఒత్తిడి కారణంగానే చాలా మంది తొక్కిసలాటలో మరణిస్తారని చెప్పారు. జనసమూహం ఒత్తిడి శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి శ్వాస మార్గాన్నిమూసివేస్తుంది, దీని కారణంగా ఊపిరి ఆడక శ్వాస ఆగిపోతుంది. వ్యక్తి చనిపోవచ్చని ఆయన తెలిపారు. దీనిని వైద్య భాషలో కంప్రెసివ్ అస్ఫిక్సియా అంటారు.
Read Also:Spiritual Practice : ఆత్మను పరమాత్మతో కలిపే సాధన.. ప్రతి రోజు జపం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
ప్రివెన్షన్ వెబ్.నెట్ (Preventionweb.net) ప్రకారం.. ఒక వ్యక్తి తొక్కిసలాటలో పడిపోతే ప్రజలు అతనిపై ఎక్కుతారు. దీని వలన మెడ ఎముకలు విరిగిపోవడం, తలకు గాయం కావడం లేదా ఇంటర్నల్ ఇంజ్యూరీస్ కారణంగా రక్తస్రావం జరగవచ్చు. పడిపోయిన వ్యక్తి నిలబడడానికి, రక్షించుకోవడానికి అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితిలో అతను చనిపోవచ్చు.
తొక్కిసలాటకు అతిపెద్ద కారణం
తొక్కిసలాటలో భయం, భయాందోళన అత్యంత ప్రాణాంతకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పుకారు అకస్మాత్తుగా వ్యాపించినప్పుడు, ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఈ భయాందోళన తొక్కిసలాటకు అతిపెద్ద కారణం అవుతుంది. ప్రజలు ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభిస్తారు. తమను తాము రక్షించుకునే తొందరలో ఇతరులను తొక్కివేస్తారు. జన సమూహాన్ని నియంత్రించే వ్యూహాలు సరిగ్గా అమలు చేయకపోవడం, తగినంత భద్రతా ఏర్పాట్లు లేకపోవడం కూడా తొక్కిసలాటకు దారితీస్తుంది.
Read Also:Sidhu Jonnalagadda : సినిమా ఫ్లాప్.. రూ.4కోట్లు తిరిగిచ్చిన హీరో సిద్ధు జొన్నలగడ్డ
రెస్క్యూ, ప్రథమ చికిత్స
సరైన ప్రథమ చికిత్స ప్రాణాలను కాపాడగలదు. తొక్కిసలాటలో గాయపడిన వ్యక్తులకు తక్కువ సమయంలో అందిస్తే, వారు మరణం నుంచి కాపాడబడతారు. ఆసుపత్రికి వెళ్లే ముందు CPR ఇవ్వడం ద్వారా ప్రతి 3 మందిలో 1 మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. CPR ఇవ్వడానికి ఎటువంటి వైద్య పరికరం అవసరం లేదు. దీనిపై ప్రాథమిక అవగాహన ఉంటే సరిపోతుంది.
-
Bengaluru Stampede : బెంగళూరు విషాద ఘటన..కేఎస్సీఏ కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరాం రాజీనామా
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
-
Arrest Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ట్రెండింగ్లో #ArrestKohli
-
Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట.. అప్పుడు అల్లు అర్జున్.. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ అరెస్ట్ ?
-
Bengaluru Stampede Tragedy: మీరు మారరా.. తొక్కిసలాటపై మండిపడుతున్న నెటిజన్లు
-
Chinnaswamy Stadium: చిన్న స్వామి స్టేడియం కాదు.. స్విమ్మింగ్ పూల్.. స్నానం చేసిన ప్లేయర్