Chinnaswamy Stadium: చిన్న స్వామి స్టేడియం కాదు.. స్విమ్మింగ్ పూల్.. స్నానం చేసిన ప్లేయర్

Chinnaswamy Stadium: వర్షానికి బెంగళూరు చిన్న స్వామి స్టేడియం నిండిపోయింది. కాస్త సమయం పడిన భారీ వర్షానికి స్టేడియం చెరువులా మారిపోయింది. అయితే వర్షం పడుతున్న సమయంలో క్రికెటర్లు అక్కడే స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. వర్షానికి స్టేడియం చెరువులా మారిపోవడంతో ప్రాక్టీస్ చేస్తున్న బెంగళూరు ప్లేయర్లు వర్షాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా బెంగళూరు జట్టులో కీలక ఆటగాడు డేవిడ్ అందులో సరదాగా గడిపాడు. చెరువులా మారిపోయిన మైదానంలో తన జెర్సీని తొలగించి స్నానం చేశాడు. వర్షం కురుస్తుంటే ఆగకుండా ఆ వాటర్లో స్నానం చేస్తూ ఎంజాయ్ చేశాడు.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
Tim David ❌
Swim David ✅Bengaluru rain couldn’t dampen Timmy’s spirits… Super TD Sopper came out in all glory. 😂
This is Royal Challenge presents RCB Shorts. 🩳🤣#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/PrXpr8rsEa
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 16, 2025
దీనికి సంబంధించిన మొత్తం వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షం బెంగళూరు నగరాన్ని ముంచెత్తగా.. చిన్న స్వామి స్టేడియాన్ని ఇలా చేసింది. కళ్ల ముందు ఎక్కువగా వాటర్ ఉండటంతో బెంగళూరు ప్లేయర్ డేవిడ్ చిన్నపిల్లాడు అయిపోయాడు.. స్టేడియంలో నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేశాడని.. చూస్తే ముచ్చట వేస్తుందని బెంగళూరు జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డేవిట్ ఈ వర్షంలో ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 2025 జరుగుతోంది. అయితే భారత్, పాక్ యుద్ధ వాతావరణం వల్ల కొన్ని రోజులు వాయిదా వేశారు. ఇటీవల ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ను మే 17న తిరిగి మళ్లీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కూడా బీసీసీఐ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025లో ఇంకా 17 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి మే 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. మొత్తం ఆరు స్టేడియంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. బెంగళూరు, జైపుర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికల్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే మే 17వ తేదీన ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
మే 29 క్వాలిఫయర్ 1 మ్యాచ్ నిర్వహించునుండగా.. 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని అయితే బీసీసీఐ వెల్లడించలేదు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ ఈ సీజన్లో టాప్లో గుజరాత్ టైటాన్స్ ఉండగా.. సెకండ్ ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. గుజరాత్ 11 మ్యాచ్లు ఆడిన 8 గెలిచి మూడు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 11 మ్యాచ్లు ఆడి 8 గెలవగా మూడు ఓడిపోయింది. అయితే రన్రేట్ గుజరాత్కు ఎక్కువగా ఉండటంతో మొదటి ప్లేస్లో ఉంది. ఇందులో మొత్తం 12 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ ఆడి 7 మాత్రమే గెలిచింది. మిగిలిన మూడు ఓడిపోయింది.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
-
Whatsapp New Feature: వాట్సాప్లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే