How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
How Many Times Eat a Day: చాలా మంది బరువు తగ్గాలని రోజులో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే రోజులో ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How Many Times Eat a Day: సాధారణంగా రోజుకి మూడు పూటలు భోజనం చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం చేస్తారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తప్పకుండా తినాలి. ఫుడ్ లేకపోతే మనిషి చాలా నీరసం అయిపోతాడు. చాలా మంది బరువు తగ్గాలని రోజులో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే రోజులో ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read: Urinary Infection : మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా? ఈ 7 వ్యాధులకు సంకేతం కావచ్చు!
రోజుకు రెండుసార్లు భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకేసారి భోజనం చేసేవారు యోగులు, రెండుసార్లు భోజనం చేసేవారు భోగీలు , మూడుసార్లు భోజనం చేసేవారు రోగీలు అనే ఒక డైలాగ్ వైరల్ అవుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తే రోజుకి రెండుసార్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఆలస్యంగా తింటుంటారు. సరైన సమయానికి రోజుకి రెండు సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫస్ట్ భోజనం ఉదయం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య తీసుకోవచ్చు. అలాగే రెండో భోజనం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య తినాలి. అంటే సూర్యాస్తమయానికి ముందే డిన్నర్ కంప్లీట్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం తిన్న తర్వాత ఆకలి అనిపిస్తే పండ్లు, సూప్ లేదా మజ్జిగ వంటివి తీసుకోవచ్చు. అయితే భోజనం అనేది రోజుకి రెండుసార్లు చేసినా కూడా మధ్యలో ఏదో ఒకటి తింటుండాలి. అయితే రోజులో ఉదయం పూట తీసుకునే భోజనం మాత్రం పోషకాలు ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. ఇందులోని పోషకాల వల్ల మీకు రోజంతా శక్తి ఉంటుంది. యాక్టివ్గా ఉంటారు. నీరసం, అలసట వంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉండే వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Blood Test : రక్తం తీయకుండానే బ్లడ్ టెస్ట్.. 20 సెకన్లలో ఫేస్ స్కాన్తో రిపోర్టులు రెడీ
సూర్యాస్తమయానికి ముందే భోజనం చేసేయాలి. తేలిక పాటి ఫుడ్ తీసుకోవాలి. సూప్, సలాడ్ వంటివి తీసుకోవాలి. దీనివల్ల మీరు తీసుకునే ఫుడ్ కూడా జీర్ణం అవుతుంది. అయితే ఒక్కో భోజనానికి కనీసం ఆరు గంటలు తేడా ఉండేట్లు చూసుకోవాలి. ఇలా భోజనం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. భోజన విషయంలో సమయం పాటించాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
-
Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా
-
YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?
-
Covid Cover in Health Insurance: కరోనా మళ్లీ పెరిగింది.. మీ హెల్త్ ఇన్సూరెన్స్లో కోవిడ్ కవర్ ఉందో లేదో తెలుసుకోండి
-
Groom Viral Video: మైఖెల్ జాక్సన్ తమ్ముడిలా ఉన్నాడు.. వధువు ముందు డ్యాన్స్ ఇరగదీసిన వరుడు
-
Covid 19: మీ కారులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలాన్ పడకుండానే కాదు.. కరోనా నుంచి సేఫ్!
-
500 notes should be abolished: అవినీతిని అంతం చేయాలంటే రూ.500నోటు కూడా వద్దు.. ప్రధానిని కోరిన చంద్రబాబు