Shubman Gill: శుభ్మన్ గిల్ను కెప్టెన్ చేయడం వెనుక ఇంత కథ జరిగింది

Shubman Gill: టెస్ట్ మ్యాచ్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ శుభ్మన్ గిల్ను టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్గా నియమించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్గా చాలా మంది పేర్లే వినిపించాయి. గిల్, పంత్, బుమ్రా పేర్లు అయితే ముఖ్యంగా వినిపించాయి. తప్పకుండా గిల్ను కెప్టెన్ చేస్తారని అందరూ భావించినట్లు జరిగింది. అయితే గిల్ను కెప్టెన్ చేయడం వెనుక ఓ స్టోరీ ఉందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. గతేడాది కూడా డ్రెస్సింగ్ రూమ్ను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ గిల్ను కెప్టెన్ చేయడం వెనుక ఉన్న స్టోరీని తెలిపారు. కేవలం ఒక పర్యటన కోసం కెప్టెన్లను ఎంపిక చేయరని, భవిష్యత్తు పరంగా ఆలోచించే గిల్ను కెప్టెన్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి:Ration Card : 6 నెలలుగా రేషన్ తీసుకోని 96 వేల కార్డులు.. అనుమానాస్పద కార్డులపై సర్కార్ విచారణ!
గతేడాది నుంచి శుభ్మన్ను కెప్టెన్ కోసం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కెప్టెన్సీ అనేది చాలా ఒత్తిడితో తీసుకునే నిర్ణయం. సరైన వ్యక్తినే ఎన్నుకున్నామని, శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు అని తెలిపారు. టెస్ట్ మ్యాచ్ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్లే్స్ను రిప్లేస్ చేయడం అంత సులువు కాదు. వీరు రిటైర్మెంట్ ప్రకటించడంతో మిగతా ఆటగాళ్లకి వారి టాలెంట్ ఏంటో నిరూపించుకునే అవకాశం లభించిందన్నారు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 ప్రారంభం కానుండంతో అద్భుతమైన ప్రదర్శన కోసం గిల్ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో ఆలోచించి ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేశామని అజిత్ అగార్కర్ తెలిపారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల టెస్ట్ మ్యాచ్లకు వరుసగా రిటైర్మైంట్ ప్రకటించారు. అయితే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వలేదనే కారణంతోనే రిటైర్మెంట్ ప్రకటించారని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత అనే విషయంపై అయితే క్లారిటీ లేదు. అయితే టీమిండియా కెప్టెన్గా గిల్ లేదా బుమ్రా పేరే ఎక్కువగా వినిపించింది. కానీ బుమ్రా ఎక్కువగా గాయాల బారిన పడుతుండటంతో కెప్టెన్సీ బాధ్యతలను గిల్కి అప్పగించారని కూడా వినిపిస్తోంది. మరి గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఎలా ఆటను ప్రదర్శిస్తుందో చూడాలి.
ఇది కూడా చూడండి:Instagram: ఈ 5 టిప్స్ తో సైబర్ దాడుల నుంచి మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సేఫ్ గా ఉంచుకోండి
ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్). రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.