Surya Kumar Yadav breaks World Record: టీ20ల్లో వరల్డ్ రికార్డును బీట్ చేసిన సూర్య కుమార్ యాదవ్
Surya Kumar Yadav breaks World Record: ఐపీఎల్ సీజన్లో 25 కంటే స్కోర్లు చేసిన వారిలో సూర్య కుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. మొత్తం 14 ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ చేశాడు.

Surya Kumar Yadav breaks World Record: స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఈ జట్టు ప్లేఆఫ్స్కు చేరింది. అయితే సూర్య కుమార్ యాదవ్ T20 క్రికెట్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. అయితే T20 క్రికెట్లో వరుసగా 14వ సారి 25 ప్లస్ స్కోర్ చేసి రికార్డును సృష్టించాడు. ఫార్మాట్లో వరుసగా అత్యధికంగా 25కి పైగా స్కోర్లు చేసిన టెంబా బావుమా రికార్డును సూర్య కుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు. గతంలో వరుసగా 13 స్కోర్లు చేసిన టెంబా బావుమా రికార్డు సూర్య కుమార్ యాదవ్ అధిగమించాడు. ఐపీఎల్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిదో ఓవర్లో కైల్ జేమిసన్ వేసిన చివరి బంతికి ఫోర్ కొట్టడంతో సూర్య కుమార్ యాదవ్ ఈ రికార్డును సృష్టించాడు. ఆ ఓవర్లో ఐదు బంతుల్లో 14 పరుగులు చేసిన చివరి బంతితో మైలురాయి చేరుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు 25 ప్లస్ స్కోర్ అత్యధికంగా చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇంతకు ముందు కేన్ విలియమ్సన్, శుభ్మాన్ గిల్ ఒక సీజన్లో 13 సార్లు అలాంటి స్కోర్లు చేశారు.
Also Read: A Cricket match that made History: చరిత్ర సృష్టించిన క్రికెట్ మ్యాచ్.. 2 పరుగులకే ఆలౌట్, 8మంది డకౌట్
ఐపీఎల్ సీజన్లో 25 కంటే స్కోర్లు చేసిన వారిలో సూర్య కుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. మొత్తం 14 ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్లో కూడా సూర్య కుమార్ యాదవ్ నిలకడగా ఆడుతున్నాడు. 14 వరుస 25+ స్కోర్లలో నాలుగు 50+ స్కోర్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 73* పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేశాడు.
Also Read: Viral Video: అన్నా మళ్లొచ్చినా.. ప్రపంచాన్ని ఊపేస్తున్న థాయ్ పాటలు.. ఇంకోటి వచ్చిందండోయ్
ఐపీఎల్లో ఫ్లేఆప్స్ రేసులో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో కిందకు వెళ్లిపోయింది. పంజాబ్ జట్టు డైరెక్ట్గా క్వాలిఫయర్ 1కు చేరుకుంది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ముంబై జట్టు టాప్ 2 ఆశలు గాల్లో కలిసిపోయినట్లే. అయితే ముంబై జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్లలో 8 మాత్రమే విజయం సాధించింది. అయితే దీంతో నాలుగో స్థానంలో ఉంది. అయితే టాప్ 2 వెళ్లిన జట్లు క్వాలిఫయర్ 1 ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు డైరెక్ట్గా ఫైనల్కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు మళ్లీ ఫైనల్లో క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్టుతో ఆడుతుంది.
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్లో బన్ని
-
Bad news for RCB fans: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్కు వరుణుడి ముప్పు
-
Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు
-
IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ కు వరుణ గండం.. మోదీ పిచ్ ఎవరికీ కలిసొస్తుంది ?