Suryakumar Yadav : ఆస్పత్రిలో చేరిన స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంతకీ ఏమైందంటే ?

Surya Kumar Yadav : భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించిన సూర్య ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. అక్కడి నుంచి తన అభిమానుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. తనకు ఉన్న స్పోర్ట్స్ హెర్నియా సమస్యకు విజయవంతంగా సర్జరీ జరిగిందని తెలిపాడు.
34 ఏళ్ల సూర్యకుమార్ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆరోగ్యం గురించి తెలియజేశాడు. ఈ సర్జరీ కారణంగా అతను రాబోయే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే అవకాశం తక్కువ. పూర్తిగా కోలుకోవడానికి అతనికి 6 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది (2026) భారత్, శ్రీలంకలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆ టోర్నీలో అతను కీలక పాత్ర పోషించనున్నాడు. రోహిత్ శర్మ తర్వాత, బీసీసీఐ (BCCI) సూర్యకు టీ20 జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.
Read Also:Children: మాల్స్కు కాదు.. పిల్లలను ఈ ప్రదేశాలకు తీసుకెళ్లండి
సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా.. “నా ఆరోగ్యం గురించి అప్డేట్. పొత్తికడుపులో ఉన్న స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్నాను. విజయవంతంగా సర్జరీ పూర్తి అయ్యాక, నేను కోలుకుంటున్నాను. క్రికెట్ మైదానంలోకి తిరిగి రావడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను.” అంటూ రాసుకొచ్చారు.
సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్ జట్టులో ఒక ముఖ్యమైన ఆటగాడు. టీ20 క్రికెట్లో అతను ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అతని అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో ఉంది. అక్కడ భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. దీని తర్వాత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది. బంగ్లాదేశ్లో వన్డే, టీ20 సిరీస్లు ఉంటాయి. మొదటి టీ20 మ్యాచ్ ఆగస్టు 26న, చివరి మ్యాచ్ ఆగస్టు 31న జరుగుతాయి.
Read Also:India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే
సూర్యకుమార్ యాదవ్ ఈ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే అవకాశం తక్కువ. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ తర్వాత కోలుకోవడానికి 6 నుండి 12 వారాలు పడుతుంది కాబట్టి, అతను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి సమయం పడుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20లో అతి పెద్ద టోర్నీ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంకలలో జరుగుతుంది. ఇందులో మొత్తం 20 జట్లు ఆడతాయి. ఈ ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
సూర్య కెరీర్ రికార్డులు!
సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అతను ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్, 37 వన్డే మ్యాచ్లు, 83 టీ20 మ్యాచ్లు ఆడాడు. అతను వన్డేల్లో 773 పరుగులు, టీ20లలో 2598 పరుగులు చేశాడు. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టీ20లలో అయితే 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు కొట్టి, ఈ ఫార్మాట్లో ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.