UPI : యూపీఐ కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకుండానే డబ్బులు పంపొచ్చు.. పిన్ సెట్ చేయవచ్చు.. ఎలాగంటే

UPI : ఈ రోజుల్లో అందరూ యూపీఐ ద్వారా మొబైల్ నుండే డబ్బులు పంపుతున్నారు. కానీ కొన్నిసార్లు, ఇంటర్నెట్ లేని చోట లేదా నెట్వర్క్ లేని పరిస్థితుల్లో ఎవరికైనా డబ్బులు పంపాల్సి వస్తే చాలా కష్టంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం, ఎన్పిసి ఒక అద్భుతమైన సర్వీస్ను అందుబాటులోకి తెచ్చాయి. అదే USSD బేస్డ్ యూపీఐ సర్వీస్, ఇది *99# నంబర్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా చాలా సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
*99# అనేది ఒక USSD బేస్డ్ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్. దీని సహాయంతో మీరు ఇంటర్నెట్ లేకుండా, స్మార్ట్ఫోన్ లేకపోయినా కూడా డబ్బులు పంపవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మీ యూపీఐ పిన్ కూడా మార్చుకోవచ్చు. ఈ సర్వీస్ 24×7 పనిచేస్తుంది. దేశంలోని అన్ని మొబైల్ నెట్వర్క్లలో అందుబాటులో ఉంది.
Read Also:Sapthami Gowda : నితిన్ సినిమాలో కాంతారా బ్యూటీ ఉండేది అంత సేపేనా.. ఫస్ట్ సినిమానే షాక్
ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపడానికి ముందుగా మీ ఫోన్ డయలర్లో *99# అని టైప్ చేసి కాల్ చేయండి. మీ ముందు భాషను ఎంచుకునే ఆప్షన్ వస్తుంది. అందులో 1 డయల్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరికి డబ్బులు పంపాలనుకుంటున్నారో వారి యూపీఐ ఐడీ వివరాలను ఎంటర్ చేయండి. ఇది పూర్తయిన తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి,కంటిన్యూ చేయాలి. పిన్ వెరిఫై అయిన తర్వాత, డబ్బులు పంపబడతాయి. ఈ పద్ధతి ద్వారా మీరు కేవలం రూ. 5000 మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. ఇదే పద్ధతిని ఉపయోగించి మీరు మీ యూపీఐ పిన్ను కూడా మార్చుకోవచ్చు.
యూపీఐ పిన్ సెట్ చేయలేదా?
మీ యూపీఐ పిన్ ఇంకా సెట్ చేసుకోకపోతే, ఈ కింది విధంగా చేయండి
* మీ మొబైల్ డయలర్లో *99# అని టైప్ చేసి కాల్ చేయండి.
* లాంగ్వేజీని సెలక్ట్ చేసుకుని టైప్ చేసి సెంట్ చేయండి.
* “Set UPI PIN” అనే ఆప్షన్ వస్తుంది. ఇది మీకు 5వ నంబర్లో కనిపించవచ్చు.
* ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలు, కార్డ్ గడువు తేదీని నమోదు చేయాలి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయాలి.
* ఇప్పుడు కొత్త యూపీఐ పిన్ క్రియేట్ చేయమని అడుగుతుంది. మీకు నచ్చిన 4 లేదా 6 అంకెల పిన్ను నమోదు చేసి, మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి.
Read Also:Viral : ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా.. హెచ్ఆర్ షాక్, నెటిజన్లు ఫైర్