Tirupathi: బెస్ట్ కాలేజీలో ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా.. ఆలస్యమెందుకు అప్లై చేసేయండి

Tirupathi: తిరుమల తిరుపతి అంటే చాలా మందికి భక్తి. ఈ దేవుడి పేరు తలుచుకుంటే చాలు కోరుకున్న పనులు అన్ని జరుగుతాయని భావిస్తారు. అలాంటిది టీటీడీ కాలేజీలో ప్రవేశాలు అంటే తప్పకుండా జాయిన్ కావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తిరుపతి దేవస్థానంలోని అన్ని విద్యా సంస్థలు కూడా విద్యార్థులను మంచి బాటలో తీసుకెళ్తున్నాయి. దీంతో చాలా ఈ కాలేజీల్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే పిల్లలు సరైన దారిలో ఉండటానికి ఇంటర్ అనేది చాలా ముఖ్యమైనది. అయితే టీటీడీ బాల బాలికలకు వేర్వేరుగా రెండు జూనియర్ కాలేజీలను నిర్వహిస్తోంది. ఇందులో విద్యార్థులకు ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఉత్తమ బోధన, వసతి సౌకర్యం, సైన్స్ విద్యార్థులకు కావాల్సిన అన్ని ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు వంటివి కూడా ఉంటాయి. ఎక్కువగా రాయలసీమకు చెందిన పేద తరగతి విద్యార్థులు ఈ కాలేజీల్లో చదవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ కాలేజీలో ప్రవేశాల కోసం విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నారు.
Read Also:iQOO Neo 10 5G : 36 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. iQOO Neo 10 5G బ్యాటరీ అదరహో..ధర ఎంతంటే?
తిరుమల తిరుపతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి ప్రతీ ఏటా 792 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఫస్ట్, సెకెండ్ ఇయర్ విద్యార్థుల్లో మొత్తం 600 మందికి హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. అయితే బాలికల కోసం శ్రీపద్మావతి జూనియర్ కళాశాల కూడా ఉంది. ఇక్కడ 968 మంది అమ్మాయిలకు ఫస్ట్ ఇయర్లో ప్రవేశం కల్పిస్తారు. ఫస్ట్, సెకెండ్ ఇయర్ స్టూడెంట్స్కు కలిపి 1100 మందికి హాస్టల్ సదుపాయం ఉంది. అయితే హాస్టల్, కాలేజీ ఒకే దగ్గర ఉండటంతో ఈ కాలేజీలో జాయిన్ కావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే వైట్ రేషన్ కార్డు ఉన్నవారు కేవలం కరెంట్ బిల్ కడితే సరిపోతుంది. అయితే అలిపిరి సమీపంలో బధిర విద్యార్థులకు కూడా ప్రత్యేక కాలేజీ ఉంది. ఇందులో ఏడాదికి 45 మందిని జాయిన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా కాలేజీ దగ్గరే వసతి గృహం ఉంది.
Read Also:Lenovo Laptop : తక్కువ ధరలో పవర్ ప్యాక్డ్ .. రూ.9,999లకే లెనోవో ల్యాప్టాప్
తిరుపతి భవాని నగర్లోని ఎస్వీ ఓరియంటల్ కాలేజీలో పదో పూర్తి చేసుకున్న తర్వాత ప్రీ డిగ్రీ, బీఏవోఎల్లో తెలుగు, సంస్కృతం, హిందీ విభాగాల్లో జాయిన్ అవుతారు. ఈ కాలేజీల్లో సైన్స్ విద్యార్థులు రూ.5,350, ఆర్ట్స్ విద్యార్థులు రూ.4,400 రుసుము చెల్లించాలి. అయితే ఇప్పటి వరకు పద్మావతి కాలేజీలో ప్రవేశం కోసం 6 వేలు, ఎస్వీ కళాశాల్లో అడ్మిషన్ కోసం 7,200 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ప్రవేశాలకు ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మే 31వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. admission.tirumala.org వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.